ఆ రాష్ట్రాల్లోనే అత్యధిక కరోనా మరణాలు

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43,846 కొత్త కేసులు నమోదు కాగా, ఇందులో 83(83.14) శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనే వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించింది...

Updated : 21 Mar 2021 23:23 IST

83 శాతం కొత్త కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43,846 కొత్త కేసులు నమోదు కాగా, ఇందులో 83(83.14) శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనే వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే నిన్న ఒక్క రోజే మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 27, 126 కేసులు రాగా, పంజాబ్‌ 2,578, కేరళలో 2,078 పాజిటివ్‌లు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కర్ణాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో కేసుల సంఖ్య వెయ్యికి పైగానే ఉందని అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130 కి చేరిందని ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో మహమ్మారి ధాటికి నిన్న ఒక్క రోజే 197 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో ఆరు రాష్ట్రాల్లోనే 86.8 శాతం మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా మహమ్మారి ధాటికి మరణించిన వారి సంఖ్య మొత్తం 3,09,087కి పెరిగింది. కొత్తగా నమోదవుతోన్న కరోనా మరణాలు అధికంగా మహారాష్ట్రలోనే ఉండగా, గడిచిన 24 గంటల్లో 92 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని