పీఎం- కేర్స్‌ నిధులతో 50వేల వెంటిలేటర్లు

కరోనాపై పోరులో కీలకమైన ఐసీయూ వెంటిలేటర్ల ఉత్పత్తి విషయంలో మేకిన్‌ ఇండియాకు పెద్దపీట వేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 60వేల వెంటిలేటర్లకు కేంద్రం ఆర్డర్‌ ఇవ్వగా.. అందులో 96 శాతం వెంటిలేటర్లు మేకిన్‌ ఇండియాలో భాగమేనని ఆ శాఖ కార్యదర్శి........

Published : 04 Aug 2020 21:20 IST

దిల్లీ: కరోనాపై పోరులో కీలకమైన ఐసీయూ వెంటిలేటర్ల ఉత్పత్తి విషయంలో మేకిన్‌ ఇండియాకు పెద్దపీట వేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 60వేల వెంటిలేటర్లకు కేంద్రం ఆర్డర్‌ ఇవ్వగా.. అందులో 96 శాతం వెంటిలేటర్లు మేకిన్‌ ఇండియాలో భాగమేనని ఆ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. అందులో 50వేల వెంటిలేటర్లను పీఎం- కేర్స్‌ నిధులతో ఆర్డర్‌ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

కరోనాకు ముందు దేశంలో వెంటిలేటర్ల తయారీ పరిశ్రమ అంతంతగానే ఉందని రాజేశ్‌ భూషణ్‌ అన్నారు. అలాంటిది ఇప్పుడు ఓ భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుందని చెప్పారు. కేంద్రం 60వేల వెంటిలేటర్లకు ఆర్డర్‌ చేసిందని, వీటి తయారీలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), ఆంధ్రా మెడ్‌టెక్‌ జోన్‌ది కీలక పాత్ర అని తెలిపారు. మొత్తం 50వేల వెంటిలేటర్ల కొనుగోలుకు రూ.2వేల కోట్లు పీఎం- కేర్స్‌ నుంచి వెచ్చించినట్లు తెలిపారు. ఇప్పటికే 18వేల వెంటిలేటర్లు రాష్ట్రాలకు చేరాయన్నారు. దేశంలో కరోనా బారిన పడిన వారిలో 0.27 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్‌ సపోర్ట్‌ అవసరం అవుతోందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని