Petrol Bunk:ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్లు...కానీ 57 లీటర్లు పట్టారంటా! పెట్రోల్ బంక్ నిర్వాకం
కారులో ఇంధనం పట్టే సామర్థ్యం కంటే ఎక్కువ పోసినట్లు పెట్రోల్ బంకు (Petrol Bunk) నిర్వాహకులు బిల్లు ఇచ్చిన ఘటన ఓ హైకోర్టు న్యాయమూర్తికే (High Court Judge) ఎదురయ్యింది. దీంతో కంగుతున్న ఆయన.. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ బంకును సీజ్ చేశారు.
భోపాల్: సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. పలు చోట్ల పెట్రోల్ బంకులు (Petrol Bunk) మోసాలకు పాల్పడుతుండటం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ హైకోర్టు న్యాయమూర్తికే (High Court Judge) ఊహించని సంఘటన ఎదురయ్యింది. 50 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం కలిగిన కారులో 57 లీటర్లు నింపినట్లు ఇచ్చిన బిల్లు చూసి కంగుతిన్నారు. విషయాన్ని వెంటనే జిల్లా అధికారులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. సదరు పెట్రోల్ బంకును సీజ్ చేయడంతోపాటు ఇతర బంకులపైనా దాడులు నిర్వహించారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని జబల్పూర్లో ఇది చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవల కారులో వెళ్తున్న సమయంలో ఓ పెట్రోల్ బంకులో ఆగారు. తమ కారు పెట్రోల్ ట్యాంకు ఫుల్ చేయించమని డ్రైవర్కు చెప్పారు. అనంతరం పెట్రోల్ బంకు నిర్వాహకులు ఇచ్చిన బిల్లు చూసి కంగుతిన్నారు. కారు ఇంధన ట్యాంకు సామర్థ్యం 50 లీటర్లు ఉంటే.. 57 లీటర్లు పోసినట్లు చూపించడంతో అవాక్కయ్యారు. హైకోర్టు న్యాయమూర్తి ఈ విషయాన్ని వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆ పెట్రోల్ బంకును సీజ్ చేశారు. ఆ ప్రాంతంలోని ఇతర పెట్రోల్ బంకులూ ఈ తరహా మోసానికి పాల్పడుతున్నాయా? అనే విషయాన్ని గుర్తించేందుకు అన్నింటిని తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నలుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
PM Modi: అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం తనకు ఎంతో భావోద్వేగ క్షణం అని ప్రధాని మోదీ అన్నారు. -
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..?
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.. అది భాజపా ప్రశ్న అని అన్నారు. -
అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం
Ayodhya Ram Mandir: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. -
5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
Shri Ram Navami: శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవమని గుర్తుచేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. -
అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. -
70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్ఠత పనులు
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
ధూమపానంతో లోపాల పిల్లలు!
అనారోగ్యకర జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల (స్పెర్మ్) డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మన ఓటింగ్ వ్యవస్థను తక్కువ చేయొద్దు
జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది. -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. -
నేను అరవింద్ కేజ్రీవాల్ను.. ఉగ్రవాదిని కాదు
తిహాడ్ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. -
మంచుగడ్డలపై యోగా
చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి వారిని గుజరాత్లోని కుచ్ జిల్లా మాతా నో మద్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కోర్టు వెలుపలి నేర అంగీకారాలు బలహీన సాక్ష్యాధారాలే
న్యాయస్థానం వెలుపల నిందితులు చేసే నేర అంగీకారాలు స్వభావ రీత్యా బలహీనమైన సాక్ష్యాలే అవుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. బలమైన సాక్ష్యాలను సమర్థించేవిగా మాత్రమే అవి ఉంటాయని పేర్కొంది. -
12వ తరగతి తర్వాత మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు అనుమతివ్వాలి
ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్ఎల్బీ) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం... డిగ్రీ పూర్తి చేసిన వారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. -
సంక్షిప్త వార్తలు(6)
అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్సన్ బరాకుడా’ ఆపరేషన్లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు. -
నేను ఏ పార్టీకీ ప్రచారం చేయలేదు.. అది నకిలీ వీడియో: ఆమిర్ ఖాన్
ఓ రాజకీయ పార్టీ తరఫున తాను ఎన్నికల ప్రచారం చేసినట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో నకిలీదని బాలీవుడు నటుడు ఆమిర్ ఖాన్ తెలిపారు. -
బస్తర్కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది
లోక్సభ ఎన్నికల్లో ఈ నెల 19న తొలివిడత పోలింగు జరగనున్న రాష్ట్రాల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ప్రాంతాలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లలో తరలించే ప్రక్రియ మంగళవారం మొదలైంది. -
అల్లోపతి వైద్యాన్ని కించపరిచారో జాగ్రత్త
ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణపై మరోసారి సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టు ఉత్తర్వులను గతంలో మీరెలా అవహేళన చేశారో మాకు తెలుసు. -
న్యాయప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు తీసుకోలేం
న్యాయ ప్రక్రియలో, న్యాయస్థానాలకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకొనే చర్యలను తాము తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
-
ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్ యాదవ్
-
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్
-
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
-
యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
-
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్