crime news: నూడుల్స్‌ తయారీ కేంద్రంలో పేలుడు..ఆరుగురిమృతి

బిహార్‌లోని ముజఫర్‌ నగర్‌లో నూడుల్స్‌ తయారీ కర్మాగారంలో బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Updated : 26 Dec 2021 15:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో నూడుల్స్‌ తయారీ కర్మాగారంలో బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను శ్రీకృష్ణా మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ జయంత్‌ కాంత్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది.

ఈ ఫ్యాక్టరీ ముజఫర్‌ పూర్‌లోని బేలా ఇండస్ట్రియల్‌ ప్రాంతంలో ఉంది. ప్రమాదం జరిగే సమయంలో ఆ ఫ్యాక్టరీలో ఎంత మంది పనిచేస్తున్నారన్న సమాచారం తెలియరాలేదు. ఉదయం 10 గంటల సమయలో ఈ ఫ్యాక్టరీలోని బాయిలర్‌ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ శబ్దం 5 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల నిర్మాణాలు కుప్పకూలాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని