కరోనా కేసులు.. 70 జిల్లాల్లో 150% పెరిగాయ్!
దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేస్తోంది. మార్చి 1 నుంచి 15 వరకు దేశంలో 16 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో 150%కన్నా ఎక్కువ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో మహారాష్ట్రలోనే .......
15 రోజుల్లోనే నమోదైనట్టు కేంద్రం వెల్లడి
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేస్తోంది. మార్చి 1 నుంచి 15 వరకు దేశంలో 16 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో 150%కన్నా ఎక్కువ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో మహారాష్ట్రలోనే ఎక్కువ జిల్లాలు ఉండటం గమనార్హం. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణపై కేంద్రం కలవరం చెందుతోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో దాదాపు 60శాతం ఇక్కడే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో 60శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. ప్రస్తుత కరోనా మరణాల్లో 45.4శాతం మరణాలు ఇక్కడే నమోదు కావడం ఆందోళనకరం. మార్చి 1నాటికి ఇక్కడ 11శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ఇప్పుడు 16శాతానికి పెరిగింది. మహారాష్ట్రలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ పరీక్షలు తక్కువగానే జరుగుతున్నాయి. టెస్ట్లు మరింతగా పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించాం’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
కరోనా వైరస్ మరోసారి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలను రాజేశ్ భూషణ్ కోరారు. అన్ని జిల్లాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు కనీసం 70శాతంగా నిర్వహించాలని సూచించారు. కరోనా రోగులతో దగ్గరగా మెలిగిన వారిని 72 గంటల్లోనే గుర్తించడం, ఐసోలేట్ చేయడం, వారికి పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలు సత్వరమే చేపట్టాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపైనా పలు సూచనలు చేశారు. దీనికితోడు ప్రజలు మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను శుభ్రపరుచుకోవడంపై విస్తృత అవగాహన కల్పించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే టీకా వృథా అధికం!
ఇప్పటివరకు రాష్ట్రాలకు 7.54కోట్ల టీకా డోసులను అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. టీకా వృథాను నివారించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని కోరారు. తెలంగాణ, ఏపీ, యూపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో టీకా వృథా అవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ వ్యాప్తంగా టీకా వృథాశాతం 6.5శాతం ఉండగా.. తెలంగాణలో అత్యధికంగా 17.6శాతం ఉన్నట్టు నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. ఇది ఏపీలో 11.6శాతం, యూపీలో 9.4శాతం, కర్ణాటకలో 6.9, జమ్మూకశ్మీర్లో 6.6శాతంగా ఉన్నట్టు వివరించారు. వృథాను తగ్గించుకోవడంపై దృష్టిసారించాలని ఆయా రాష్ట్రాలను కోరినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయంలో బాధపడ్డారన్నారు. మరోవైపు, ఈ రోజు ఉదయం 9గంటల వరకు దేశ వ్యాప్తంగా 3.51కోట్ల మందికి టీకా పంపిణీ జరిగినట్టు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.