పంజాబ్ కొత్త కేసుల్లో 81శాతం బ్రిటన్ రకానివే..!
పంజాబ్లో కొన్ని నమూనాలను పరిశీలించగా వాటిలో 81శాతం బ్రిటన్ రకానికి చెందినవేనని వెల్లడైంది.
అప్రమత్తంగా ఉండాలన్న పంజాబ్ సీఎం
ఛండీగఢ్: దేశంలో కరోనా వైరస్ తీవ్రత మరోసారి పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందుకు దేశంలో వెలుగు చూస్తోన్న కొత్తరకం కరోనా వైరస్లే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్లో కొన్ని నమూనాలను పరిశీలించగా వాటిలో 81శాతం బ్రిటన్ రకానికి చెందినవేనని వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన పంజాబ్ ప్రభుత్వం, దీన్ని ఎదుర్కోవడంలో భాగంగా యువతకూ వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోన్న రాష్ట్రాల జాబితాలో పంజాబ్ కూడా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే వెల్లడించింది. దీంతో అక్కడ 401 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టగా, వీటిలో 81శాతం కేసులు బ్రిటన్ రకానికి చెందినవిగా నిర్ధారణ అయినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. యువకులకూ ఈ రకం వైరస్ సోకే ప్రమాదం ఎక్కువున్న ఉన్నందున వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సినేషన్లో 60ఏళ్లకంటే తక్కువ వయసున్న వారికి కూడా పంపిణీ చేయాలని పంజాబ్ సీఎం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలు ఈ కొత్తరకం వైరస్పై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తేలిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగించాలని సూచించారు.
నిబంధనలు పాటించకుంటే మరిన్ని ఆంక్షలు..
రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత పెరుగుతోన్న దృష్ట్యా ప్రజలు మాస్కులు, భౌతిక దూరం వంటి కొవిడ్ నిబంధనలు పాటించాలని పంజాబ్ ముఖ్యమంత్రి మరోసారి సూచించారు. వైరస్ను కట్టడి చేసేందకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తోందని, ఒకవేళ ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకుంటే మరిన్ని కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తుందని అమరీందర్ సింగ్ హెచ్చరించారు. ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోన్న దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45ఏళ్ల వయసు పైబడినవారు కూడా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 4కోట్ల 84లక్షల కొవిడ్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్