10 రాష్ట్రాల్లోనే 85 శాతం కేసులు: కేంద్రం

దేశంలో నమోదువుతున్న 85 శాతం కరోనా కేసులు 10 రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 11 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, మరో 8 రాష్ట్రాల్లో.

Published : 15 May 2021 18:32 IST

దిల్లీ: దేశంలో నమోదువుతున్న 85 శాతం కరోనా కేసులు 10 రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 11 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, మరో 8 రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. 24 రాష్ట్రాల్లో 15 శాతానికి మించి పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు.

మొత్తంగా చూసినప్పుడు దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 15.07 శాతం అంటే 36,73,802 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని పేర్కొంది. జాతీయ రికవరీ రేటు సైతం 83.83 శాతానికి పెరిగిందని తెలిపింది. 8 రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. అలాగే 17 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజువారీ కేసులు తగ్గుముఖం లేదా స్థిరంగా కొనసాగుతుండగా.. ఈ జాబితాలో తెలంగాణ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని