students Positive: ఉత్తరాఖండ్లో 85 మంది విద్యార్థులకు పాజిటివ్
నైనిటాల్లోని గంగార్కోట్లో గల జవహర్ నవోదయ విద్యాలయలో 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డిప్యూటీ కలెక్టర్ రాహుల్ సాహ్ తెలిపారు.పాఠశాల...
నైనితాల్ (ఉత్తరాఖండ్): నైనిటాల్లోని గంగార్కోట్లో గల జవహర్ నవోదయ విద్యాలయలో 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డిప్యూటీ కలెక్టర్ రాహుల్ సాహ్ తెలిపారు.పాఠశాల సిబ్బంది, విద్యార్థులు 11 మందికి తొలుత పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ కోవిడ్ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి 496 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 85 మంది విద్యార్థులకు పాజిటివ్గా తేలిందని వివరించారు.నవోదయ విద్యాలయలో కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ సూచన మేరకు పాఠశాలను మైక్రో కంటైన్మెంట్జోన్గా మార్చినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులను పాఠశాలలోనే ఐసోలేషన్లో ఉంచుతున్నట్లు, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారికి తిరిగి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించిన పిదప మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్లో శనివారం నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు ప్రభుత్వం తెలిపింది.
పశ్చిమ బెంగాల్లోనూ విద్యార్థుల కార్యక్రమాలు రద్దు
పశ్చిమ బెంగాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే పాఠశాలలు మూసివేతపై అధికారులు నిర్ణయం తీసుకోవాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. ఈ క్రమంలో ఈనెల 1నుంచి 7వరకు కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరగాల్సిన విద్యార్థుల వారోత్సవాల కార్యక్రమాలు రద్దు చేస్తూ అధికారులు నిర్ణయించారు.పశ్చిమ బెంగాల్లో తాజాగా 4,512 కొత్త కేసులు నమోదయ్యాయి.13,300 మంది కోవిడ్ సోకి చికిత్స పొందుతున్నారు.రాష్ట్రంలో 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కోవిడ్ కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తోంది.
ప్రభావాన్ని బట్టి పాఠశాలల మూత
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. ముంబై, కోల్కతా, దిల్లీ, చెన్నై వంటి నగరాల్లో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డిసెంబర్ చివరి వారం నుంచి కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడ్డారు. దీంతో మరోసారి పరిస్థితిని బట్టి పాఠశాలలు మూసివేయాలని కొన్ని రాష్ట్రాలు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. తమిళనాట పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈనెల 10వరకు 1-8తరగతుల విద్యార్థులకు సెలవు ప్రకటించి ఆన్లైన్ క్లాసులకు హాజరు కావాలని సూచించారు.తమిళనాడు, హర్యానా, దిల్లీ, కోల్కతా వంటి నగరాల్లో మరోసారి నిబంధనలు కఠినతరం చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్