Corona: 5 నెలల తర్వాత దిల్లీలో అధిక కేసులు నమోదు!
దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని నెలల పాటు తగ్గుముఖం పడుతూ వచ్చిన .......
దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని నెలల పాటు తగ్గుముఖం పడుతూ వచ్చిన కొవిడ్ కేసులు ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో మళ్లీ స్థిరంగా పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. శనివారం ఒక్కరోజే దిల్లీలో 86 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఐదు నెలల కాలంలో ఇవే అత్యధికం కావడం గమనార్హం. గడిచిన 24గంటల వ్యవధిలో 66,096 శాంపిల్స్ని పరీక్షించగా.. 86మందిలో పాజిటివ్గా తేలింది. అలాగే, శనివారం 68 మంది డిశ్చార్జి కాగా.. వరుసగా పదో రోజు కూడా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని వైద్యశాఖ అధికారులు బులెటిన్లో వెల్లడించారు. ఇంకోవైపు, దిల్లీలో 22 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిందే.
కొవిడ్ మహమ్మారి ప్రవేశించినప్పటినుంచి ఇప్పటివరకు దిల్లీలో 3,19,42,026 శాంపిల్స్ని పరీక్షించగా.. 14,42,090మందికి పాజిటివ్గా తేలింది. వీరిలో 14,16,506మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 25,100మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 484 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశ రాజధాని నగరంలో ఇప్పటివరకు 2,47,06,496 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా.. వీటిలో 1,46,24,638 మందికి తొలిడోసు అందించగా.. 1,00,81,858 మందికి రెండు మోతాదులూ అందాయని అధికారులు వెల్లడించారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్