Corona: కరోనా పాజిటివ్‌ ఉన్నా.. నెగెటివ్‌ రిపోర్ట్‌

ఆస్ట్రేలియా సిడ్నీలోని  ఓ ల్యాబ్‌ తప్పుడు రిపోర్టులు.. కరోనా వ్యాప్తికి కారణమయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. సిడ్‌ పాథ్‌ అనే ల్యాబ్‌ క్రిస్మస్‌కి ముందు చేపట్టిన కొవిడ్‌ నిర్థారణ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను తప్పుగా చూపించాయి. 

Updated : 29 Dec 2021 00:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా సిడ్నీలోని  ఓ ల్యాబ్‌ తప్పుడు రిపోర్టులు.. కరోనా వ్యాప్తికి కారణమయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. సిడ్‌ పాథ్‌ అనే ల్యాబ్‌ క్రిస్మస్‌కి ముందు చేపట్టిన కొవిడ్‌ నిర్థారణ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను తప్పుగా చూపించాయి. ఈనెల 22, 23, 24 రోజుల్లో జరిపిన 900 మందికి కరోనా నిర్థారణ పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌ వచ్చిన్నట్లు రిపోర్ట్‌ పంపింది. అందరికీ నెగెటివ్‌ రావడమనేది నమ్మశక్యంగా ఉండకపోవడంతో మరోసారి పరీక్షలు నిర్వహించగా.. ఎక్కువ మందికి పాజిటివ్‌ అని తేలింది. ఇప్పటివరకు 900 మందికి తప్పుడు మెసేజ్‌లు పంపినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. దీనిపై  ల్యాబ్‌ కూడా స్పందించింది.‘‘స్వాబ్‌ నమూనాలు భారీ సంఖ్యలో వచ్చాయి. పని ఒత్తిడి వల్లే ఇలా జరిగింది. ఆ ప్రభావం ఫలితాల మీద పడింది. అందుకు క్షమాపణ కోరుతున్నాం’’  అని సిడ్‌ పాథ్‌ ల్యాబ్‌ ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని