ప్లాస్మా ఎప్పుడు సేకరించాలి?
కరోనా మహమ్మారి మెడలు వంచే చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు రకాల ఔషధాలు అత్యవసర వినియోగం కింద ఉపయోగిస్తున్నారు..............
ఎక్కువరోజులైతే యాంటీబాడీలు ఉండవా?
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి మెడలు వంచే చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు రకాల ఔషధాలు అత్యవసర వినియోగం కింద ఉపయోగిస్తున్నారు. మరికొన్నింటి సమర్థతపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్లాస్మా చికిత్సా విధానం ఇప్పటి వరకు బహుళ ప్రాచుర్యం పొందింది. కరోనా తీవ్రరూపం దాల్చిన వారిలో ఇది మెరుగైన ఫలితాలిస్తోందని తొలుత అందరూ భావించారు. కానీ, దీని వల్ల పెద్దగా మరణాల రేటు తగ్గినట్లు ఆధారాలేమీ లేవని ఐసీఎంఆర్ కుండబద్దలు కొట్టింది. దీంతో ఈ చికిత్సా విధానం సమర్థతపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చింది.
యాంటీబాడీలు శాశ్వతం కాదా?
వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే దాంతో పోరాడేందుకు మన రోగనిరోధక శక్తి ప్రతిరక్షకాల(యాంటీబాడీల)ను విడుదల చేస్తుంది. ఇవి శరీరంలో కొన్ని నెలల పాటు.. మరికొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి. ప్లాస్మా చికిత్సలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి యాంటీబాడీలను సేకరించి బాధిత వ్యక్తికి అందిస్తారు. అవి శరీరంలో సహజంగా ప్రతిరక్షకాలు విడుదలవడానికి ముందే రోగనిరోధక వ్యవస్థను మేల్కొలిపి వైరస్తో పోరాడుతాయి. దీంతో వ్యాధి తీవ్రత భారీగా తగ్గుతుంది. అయితే, దాతల నుంచి ఈ యాంటీబాడీలను ఎప్పుడు సేకరించాలన్నది ఇక్కడ కీలకాంశం అని పరిశోధకులు అంటున్నారు. కోలుకున్న తర్వాత వీలైనంత త్వరగా ప్లాస్మాను సేకరిస్తేనే మేలని చెబుతున్నారు. కరోనా వైరస్తో పోరాడేందుకు శరీరంలో జనిస్తున్న యాంటీబాడీలు శాశ్వతం కాదని తమ పరిశోధనలో తేలినట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన రెనీ బజిన్ తెలిపారు.
ఎప్పటి నుంచి తగ్గిపోతాయి?
అధ్యయనంలో భాగంగా కొవిడ్-19 నుంచి కోలుకున్న 282 మంది నుంచి వివిధ సమయాల్లో ప్లాస్మాను సేకరించారు. వీరందరిలో వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉండింది. ఎవరూ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాలేదు. వీరి నుంచి నాలుగు నుంచి తొమ్మిది సార్లు ప్లాస్మాను సేకరించారు. లక్షణాలు కనిపించిన 33వ రోజు నుంచి 77వ రోజు మధ్య తొలిసారి.. 66వ రోజు నుంచి 114వ రోజు మధ్య చివరిసారి ప్లాస్మాను సేకరించారు. తొలుత సీరోపాజిటివ్గా తేలిన వ్యక్తులు కొన్ని నెలల్లోనే సీరోనెగెటివ్గా మారినట్లు ఈ అధ్యయనంలో గుర్తించామని బజిన్ తెలిపారు. అంటే ప్రతిరక్షకాలు కనుమరుగైపోయాయి. ఎన్నిసార్లు ప్లాస్మాను సేకరించామన్న దానితో సంబంధం లేకుండా యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని తేలిందన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ వాటంతట అవే సహజంగా కనుమరుగైపోతున్నట్లు గుర్తించామన్నారు. 15 మందిలో సుమారు 88వ రోజు నుంచి యాంటీబాడీల తగ్గుదల నమోదైనట్లు తేలిందన్నారు. అక్కడి నుంచి 21రోజు లోపు సగానికిపైగా ప్రతిరక్షకాలు తగ్గిపోయినట్లు గుర్తించామన్నారు. అంటే లక్షణాలు కనిపించిన 110వ రోజు నాటికి సగానికిపైగా యాంటీబాడీలు శరీరంలో కనుమరుగైపోతున్నాయి! ఈ నేపథ్యంలో ప్లాస్మా దానం చేయడానికి వైద్యులు అనుమతించిన తర్వాత వీలైనంత త్వరగా ఆ పని చేయాలని బజిన్ సూచిస్తున్నారు.
తగ్గుదలకు కారణమేంటి?
ప్రతిరక్షకాలు తగ్గిపోవడానికి గల కారణాలపై పరిశోధకులు దృష్టి సారించారు. దీన్ని అర్థం చేసుకోవడానికి వైరస్ కణంలోకి ప్రవేశించే రిసెప్టర్ బైండింగ్ డొమైన్(ఆర్బీడీ) అనే వ్యవస్థపై అధ్యయనం చేస్తున్నారు. ఆర్బీడీ అనేది వైరస్పై ఉండే ఒక ప్రోటీన్. ఇది కణం ఉపరితలంపై ఉండే ఏసీఈ-2 రిసెప్టార్కు అతుక్కుని అక్కడి నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఆర్బీడీ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. వైరస్ శరీరంలోని కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఈ ప్రక్రియను మరింత లోతుగా అధ్యయనం చేయడం వల్ల యాంటీబాడీలు కనుమరుగైపోవడానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజా అధ్యయనం ఉపయోగాలు..
యాంటీబాడీల తగ్గుదలపై అధ్యయనం చేయడం వల్ల ప్లాస్మా చికిత్స విధివిధానాలను సమర్థంగా రూపొందించే అవకాశం ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. సీరో సర్వే నిర్వహణ, వ్యాక్సిన్ అభివృద్ధికి కూడా ఈ ఫలితాలు ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే ఏ రకమైన ప్లాస్మా ఎంచుకోవాలన్నదానిపై ఇప్పటికీ ఇంకా స్పష్టత లేదు. దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కూడా ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM