-20 డిగ్రీల చలిలో.. 17వేల అడుగుల ఎత్తులో..!

భారత-టిబెట్‌ సరిహద్దు పోలీసు జవాన్లు -20 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో శనివారం దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న లద్దాఖ్‌ మంచుప్రాంత ఉష్ణోగ్రత ప్రస్తుతం సున్నా డిగ్రీల కన్నా తక్కువగా ఉంటుంది.

Published : 15 Nov 2020 03:26 IST


న్యూ దిల్లీ : చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఇండో-టిబెటిన్‌  జవాన్లు -20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో శనివారం దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న లద్దాఖ్‌ మంచుప్రాంత ఉష్ణోగ్రత ప్రస్తుతం సున్నా డిగ్రీల కన్నా తక్కువగా ఉంటుంది.. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో  కూడా దీపావళి సందర్భంగా   జవాన్లు ఆనందంగా నృత్యాలు చేశారు.  భారత మాజీ ప్రధాని వాజ్‌పేయ్ కంపోజ్‌ చేసిన ‘అహో ఫిర్‌ ఫిర్‌ దియా జాలేనా’అనే పాటను పాడుతూ నృత్యాలు చేశారు.  శీతాకాలంలో  ఈ ప్రాంత ఉష్ణోగ్రత మైనస్‌ 40 డిగ్రీస్‌కు తగ్గుతుంది.  ప్రధానమంత్రి మోదీ శనివారం జైసల్మీర్‌లోని లోంగోవాలా పోస్ట్‌ సరిహద్దు జవాన్లను  కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా జవాన్లనుద్దేశించి  మోదీ ఉద్వేగభరిత ప్రసంగం ఇచ్చారు. గత సంవత్సరం మోదీ ఉత్తరాఖండ్‌లోని  భారత-చైనా, భారత- టిబెట్‌ సరిహద్దు పోలీసు జవాన్లు, జమ్ము&కశ్మీర్‌ జవాన్లతో దీపావళి జరుపుకొన్న విషయం తెలిసిందే.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని