రైతుల డిమాండ్లు తీర్చకపోతే భాజపాకు కష్టమే.. గవర్నర్ మాలిక్ షాకింగ్ కామెంట్స్!
సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న అన్నదాతల డిమాండ్లు నెరవేర్చాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు........
MSPకి హామీ ఇస్తే మధ్యవర్తిగా ఉంటానని కేంద్రానికి సూచన
ఝున్ఝును: సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న అన్నదాతల డిమాండ్లు నెరవేర్చాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కర్షకుల డిమాండ్లు తీర్చకపోతే భాజపా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన రాజస్థాన్లోని ఝున్ఝును జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ‘‘వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలో భాజపా నేతలు పలు గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నారు. నాది మేరఠ్. ఆ ప్రాంతంలో భాజపా నేతలు ఏ గ్రామానికీ వెళ్లలేకపోతున్నారు. మేరఠ్, ముజఫర్నగర్, బాఘ్పట్లోనూ ఇదే పరిస్థితి ఉంది’’ అని తెలిపారు. రైతుల పక్షాన మాట్లాడుతున్న మీరు పదవికి రాజీనామా చేస్తారా?అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సత్యపాల్ మాలిక్ స్పందిస్తూ.. ‘‘నేను రైతుల తరఫున నిలబడతా. అందుకోసం నా పదవి వదులుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ అవసరమే వస్తే ఆ పని కూడా చేస్తాను’’ అని వ్యాఖ్యానించారు.
ప్రధాని, హోంమంత్రితోనూ వాదించా!
పశ్చిమ యూపీకి చెందిన జాట్ నేత అయిన సత్యపాల్ మాలిక్.. రైతుల అంశంపై పలువురు కేంద్ర పెద్దలతో నేతలతో గొడవపడ్డానన్నారు. రైతుల కోసం ప్రధాని, హోంమంత్రి, ప్రతిఒక్కరితోనూ తన వైఖరిని చెప్పానన్నారు. రైతుల విషయంలో మీరు తప్పు చేస్తున్నారు.. అలా చేయొద్దు’’ అని వారితో చెప్పినట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీని ఇస్తే ఈ సమస్య పరిష్కారమైపోతుందని మాలిక్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఈ మూడు సాగుచట్టాలపై స్టే విధించినందున రైతులు కూడా ఆ అంశాన్ని వదిలేయొచ్చని సూచించారు. కేంద్రం కనీస మద్దతు ధర చట్టబద్ధతకు రైతులకు హామీ ఇస్తానంటే.. తాను రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నానన్నారు. రైతులు తమ ఇళ్లు, భూములకు దూరమై దాదాపు 10 నెలలకు పైగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారి డిమాండ్లను వినాలన్నారు. తాను రైతుల పక్షాన ఉంటానని, అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.
ఉగ్రవాదులు అప్పుడు ఇలాంటి ధైర్యం చేయలేదు..
జమ్మూకశ్మీర్లో పౌర హత్యలపైనా ఆయన స్పందించారు. తాను గతంలో జమ్మూకశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో శ్రీనగర్కు 50కి.మీ- 100కి.మీల పరిధిలోకి వచ్చేందుకు ఉగ్రవాదులు ధైర్యం చేయలేదని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు మాత్రం పేద ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారని.. ఇది బాధాకరమన్నారు.
మరోవైపు, ప్రస్తుతం మేఘాలయ గవర్నర్గా ఉన్న 75 ఏళ్ల సత్యపాల్ మాలిక్.. భాజపాకు ముందు కాంగ్రెస్, జనతాదళ్, లోక్దళ్, సమాజ్వాదీ పార్టీల్లోనూ పనిచేశారు. రైతు నిరసనలను వేదికగా మలచుకొని ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!