లెబనాన్కు భారత్ మరోమారు చేయూత
లెబనాన్కు భారత్ మరోసారి చేయుతనందించనుంది. ఆగస్టు 4న లెబనాన్ రాజధాని బీరుట్లో..
వెల్లడించిన అమెరికాలోని భారత శాశ్వత ప్రతినిధి
న్యూయార్క్: లెబనాన్కు భారత్ మరోసారి చేయుతనందించనుంది. ఆగస్టు 4న లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుడు కారణంగా 150 మందికిపైగా మృతిచెందారు. అనేక నిర్మాణాలు కూలిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. మొదట కొవిడ్ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అక్కడికి వైద్య పరికరాలు పంపించింది. కాగా స్థానిక అధికారులకు సహకరించేందుకు దేశం నుంచి మానవ వనరులను పంపనున్నట్లు అమెరికాలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ త్రిపాఠి తాజాగా వెల్లడించారు. ‘భారత ప్రభుత్వం తరఫున లెబనాన్ ప్రజలకు, ప్రభుత్వానికి మా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. దుర్ఘటన సమాచారం విన్న తర్వాత నిర్ఘాంతపోయాం. ఘటన అనంతరం అధికారులు, స్థానికుల పనితీరు ప్రసంశనీయం. ఎంతో అంకితభావం ప్రదర్శించారు. వారికి తోడ్పాటునందించేందుకు భారత్ నుంచి మానవ వనరులను పంపించనున్నాం’ అని త్రిపాఠి పేర్కొన్నారు. సహాయ సహకారాలు అందించేందుకు భారత ప్రభుత్వం లెబనాన్ ప్రభుత్వంతో మంతనాలు సాగిస్తోందని తెలిపారు.
ఈ నెల ఆగస్టు 4వ తేదీన బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 158 మంది మృతిచెందారు. 6 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ భారీ పేలుళ్ల ధాటికి నగరంలోని సగానికిపైగా కట్టడాలు దెబ్బతినడంతో వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. 2,750 మెట్రిక్ టన్నుల నైట్రేట్ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్