త్వరలో బెంగళూరులో మెట్రోసేవలు పునఃప్రారంభం..!

బెంగళూరులో త్వరలోనే మెట్రో రైళ్ల సేవలను పునఃప్రారంభిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీ.ఎస్‌ యడియూరప్ప స్పష్టంచేశారు.

Published : 27 Aug 2020 23:55 IST

బెంగళూరు: బెంగళూరులో త్వరలోనే మెట్రో రైళ్ల సేవలను పునః ప్రారంభిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్‌ యడియూరప్ప స్పష్టంచేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు పలు చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. దీనిలో భాగంగా త్వరలోనే మెట్రో సేవలను పునరుద్ధరిస్తామని.. వీటికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నగరంలో ఓ ఫ్లైఓవర్‌కు పేరును ఖరారు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి యడియూరప్ప విలేకరులతో మాట్లాడారు. కరోనా కారణంగా గత ఐదు నెలలుగా నిలిచిపోయిన మెట్రో సేవలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. సెప్టెంబర్‌ 1 నుంచి మొదలయ్యే అన్‌లాక్‌ 4.0లో కేంద్రప్రభుత్వం సూచించే మార్గదర్శకాల కోసం వేచిచూస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రామాణిక నియంత్రణ పద్ధతులను సిద్ధం చేశామని మెట్రో అధికారులు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని