భారత్ బంద్: రోడ్డెక్కిన రైతులు.. నిలిచిన రైళ్లు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్కు విస్తృతంగా మద్దతు లభిస్తోంది. అన్నదాతలకు మద్దతు ప్రకటించిన పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్కు విస్తృతంగా మద్దతు లభిస్తోంది. అన్నదాతలకు మద్దతు ప్రకటించిన పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు నేడు బంద్లో పాల్గొన్నాయి. పలు రాష్ట్రాల్లో రైతులతో పాటు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
దిల్లీ సరిహద్దుల్లో 13వ రోజు..
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ హస్తిన సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన 13వ రోజుకు చేరింది. దిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, ట్రికీ రహదారుల్లో వేలాది మంది బైఠాయించి శాంతియుతంగా ఆందోళన సాగిస్తున్నారు. చట్టాలపై ప్రభుత్వం దిగిరాకపోవడంతో మంగళవారం భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింఘ, టిక్రీ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. భారీగా సాయుధ బలగాలు మోహరించారు. అన్నదాతల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారత్ బంద్ కొనసాగుతోంది. అయితే భాజపా పాలిత రాష్ట్రాల్లో మాత్రం బంద్ ప్రభావం స్వల్పంగా కన్పిస్తోంది. రైతుల ఆందోళన దృష్ట్యా దిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
రైళ్లను అడ్డుకుని..
భారత్ బంద్కు మద్దతుగా మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో రైతు సంఘాల సభ్యులు రైల్ రోకో చేపట్టారు. మల్కాపూర్ స్టేషన్లో చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్ను ఆపి పట్టాలపై నిరసనకు దిగారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అటు ఒడిశా రాష్ట్రంలోనూ రైతుల ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో వామపక్షాలు, రైతు సంఘాల నేతలు రైళ్ల రాకపోకలను అడ్డగించారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో సమాజ్వాదీ పార్టీ నేతలు పట్టాలపై ఆందోళనకు దిగడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమబెంగాల్లోనూ వామపక్షాల నేతలు భారత్ బంద్ను మద్దతిస్తూ పలు రైళ్లను అడ్డుకున్నారు. పట్టాలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పలు రాష్ట్రాల్లో భద్రత పెంపు..
మరోవైపు భారత్ బంద్ దృష్ట్యా కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతేగాక, ఆందోళనల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని సూచించింది. అటు రైల్వే సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. బంద్ దృష్ట్యా బిహార్లో భద్రతను పెంచారు. మహారాష్ట్రలోని పుణెలో పలు దుకాణాలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. ‘భారత్ బంద్ శాంతియుతంగా కొనసాగాలి. బంద్ కారణంగా ఎవరైనా ట్రాఫిక్లో గంటల తరబడి చిక్కుకుంటే వారికి నీళ్లు, పండ్లు ఇస్తాం’ అని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికాయత్ తెలిపారు.
గుజరాత్లో ఉద్రిక్తంగా
కాగా.. భారత్ బంద్కు మద్దతుగా గుజరాత్లో చేపట్టిన ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది. హైవేలపై నిరసనకు దిగిన ఆందోళనకారులు టైర్లను దహనం చేశారు. దీంతో ఆ మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు బంద్ దృష్ట్యా యూపీలోని లఖ్నవూలో కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
పుట్టినరోజు వేడుకలకు దూరంగా సోనియా
రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. డిసెంబరు 9న సోనియా పుట్టినరోజున ఎలాంటి వేడుకలు చేసుకోవట్లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నేటి భారత్ బంద్కు కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..
మోదీజీ మీ పెద్ద మనసు చాటుకోండి: బాదల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన ప్రకటనను హస్తం పార్టీ ఖండించింది. -
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?