బైడెన్ మాట నిలబెట్టుకునేనా?
దాదాపు నాలుగు రోజుల ప్రపంచం ఉత్కంఠగా నిరీక్షించిన తర్వాత డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్నట్లు తేలింది. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నాప్పటికీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270 నిదాటేసిన బైడెన్.. 290 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అమెరికా సంప్రదాయం ప్రకారం జనవరి 20న...
వాషింగ్టన్: దాదాపు నాలుగు రోజులపాటు ప్రపంచం ఉత్కంఠగా నిరీక్షించిన తర్వాత డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్నట్లు తేలింది. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నాప్పటికీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270ని దాటేసిన బైడెన్.. 290 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అమెరికా సంప్రదాయం ప్రకారం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో డెమొక్రాట్ల మేనిఫెస్టో (పాలసీ పేపర్)ని బట్టి భారత్- అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయనేది ఒకసారి పరిశీలిస్తే!
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు పుంజుకున్న మాట వాస్తవం. ఇటీవలే దేశ రక్షణకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. మరోవైపు జో బైడెన్ విడుదల చేసిన పాలసీ పేపర్ ప్రకారం భారత్- అమెరికా సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ను శాశ్వత ప్రతినిధిగా చేర్చేందుకు అమెరికా మద్దతివ్వొచ్చు. అంతేకాకుండా ఉగ్రవాద నిర్మూలన, వాతావారణ మార్పులు, ఆరోగ్యం, వాణిజ్యం తదితర రంగాల్లో రెండు దేశాలూ కలిసి ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ 2006లో చెప్పిన తన మాటను నిలబెట్టుకునే సమయం వచ్చింది. ఎలా అంటే.. 2006లో బైడెన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘2020 నాటికి ప్రపంచంలో అత్యంత సన్నిహిత దేశాలుగా భారత్, అమెరికా అవతరించాలి. అప్పుడే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. దానికి కార్యరూపం దాల్చే సమయం వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆయన చెప్పినట్లు 2020 చివరినాటికి కాకపోయినా.. కనీసం 2021 నాటికైనా అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడే అవకాశముంది. భారత్కు బైడెన్ కొత్తేమీ కాదు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్గా, ఉపాధ్యక్షుడి హోదాలు చాలా సార్లు అధికారిక చర్చలు జరిపారు.
భారత్, అమెరికా భాగస్వాములనే తన చిరకాల నమ్మకాన్ని ఉటంకిస్తూ బైడెన్ కొద్ది రోజుల్లో ప్రకటన విడుదల చేసే అవకాశముంది. అంతేకాకుండా ఇండియాతో సంబంధాలను బలోపేతం చేయడానికి బైడెన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని బైడెన్ ఇది వరకే ఎన్నికల ప్రచారంలో చాలా సార్లు చెప్పారు. ‘‘భారత్- అమెరికా కలిసి పని చేయకపోతే ప్రపంచ సవాళ్లను అధిగమించలేం. దీనికోసం భారత్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉగ్రవాద చర్యల అణచివేత, ఆరోగ్య, వాణిజ్య తదితర రంగాల్లో అమెరికా మద్దతు కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలున్న అమెరికా, భారత్.. ప్రజాస్వామ్య విలువలను పంచుకుంటాయి’’ అని డెమొక్రాటిక్ పార్టీ తన పాలసీ పేపర్లో తెలిపింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనతోపాటు ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న తాను కూడా భారత్తో సంబంధాల కోసం కృషి చేశానని ఆయన పలుమార్లు చెప్పారు. దీనిని బట్టి ఇప్పటితో పోల్చుకుంటే భారత్తో అమెరికా బంధం మరింత బలోపతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల