చిన్న తుంపర్లతోనే పెద్ద ముప్పు
కరోనా వైరస్ సంక్రమణపై జరుగుతున్న పరిశోధనల్లో మరో మైలురాయి! బాధితుల ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు ఈ వైరస్ను మోసుకెళ్తుంటాయి. అయితే వివిధ పరిమాణాల్లోని తుంపర్ల కదలికలు..
వైద్యులకు కరోనా సోకడంలో వీటి పాత్రే ఎక్కువ!
అడ్డుకునేందుకు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు
లండన్: కరోనా వైరస్ సంక్రమణపై జరుగుతున్న పరిశోధనల్లో మరో మైలురాయి! బాధితుల ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు ఈ వైరస్ను మోసుకెళ్తుంటాయి. అయితే వివిధ పరిమాణాల్లోని తుంపర్ల కదలికలు ఎలా ఉంటాయన్న విషయాన్ని మరింత లోతుగా తెలుసుకునేందుకు... యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్బర్గ్ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా గాలి ద్వారా కరోనా వ్యాపించే తీరును తెలుసుకునేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గణిత సిద్ధాంతాల ఆధారంగా రూపొందించిన ఈ కొత్త విధానాన్ని ‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్’ పత్రిక విశ్లేషించింది.
‘‘ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్ల పరిమాణం, వాటి ప్రయాణం మధ్య ఒకే విధమైన సంబంధం ఉండటం లేదు. మధ్యస్థాయి పరిమాణంలోని తుంపర్ల కంటే చిన్న, పెద్ద తుంపర్లే ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి. ఆరోగ్య సిబ్బంది ధరించే వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈలు) పెద్ద తుంపర్లను సమర్థంగా అడ్డుకోగలుగుతున్నాయి గానీ, చిన్న తుంపర్లను మాత్రం నిలువరించలేకపోతున్నాయి. ఈ కారణంగానే చాలామంది వైద్యులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. తుంపర్ల ప్రవర్తననూ, మేం రూపొందించిన కొత్త విధానాన్ని ఆధారం చేసుకుని... ఏరోసోల్ ఎక్స్ట్రాక్టర్ అనే పరికరాన్ని రూపొందించాం. ఇది తలవెంట్రుక కంటే తక్కువ వ్యాసముండే తుంపర్ల నుంచి కూడా సమర్థంగా రక్షణ కల్పిస్తుంది. భవిష్యత్తులోనూ పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించేందుకు ఇది దోహదపడుతుంది’’ అని పరిశోధనకర్త ఫెలిసిటీ మెహండాలే వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్