బ్లింకెన్.. మన మిత్రుడే!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన జో బైడెన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్ను ఎంపిక చేశారు. ఈ శాఖలో బ్లింకెన్కు ఇప్పటికే చాలా అనుభవం ఉంది. బైడెన్తోనూ చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి........
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన జో బైడెన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్ను ఎంపిక చేశారు. ఈ శాఖలో బ్లింకెన్కు ఇప్పటికే చాలా అనుభవం ఉంది. బైడెన్తోనూ చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. యూఎస్ నావల్ అబ్జర్వేటరీ రెసిడెంట్గా బైడెన్ వ్యవహరిస్తున్న సమయంలో బ్లింకెన్ ఆయనకు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. అలాగే సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్గా బైడెన్ ఉన్నప్పుడు అందులో బ్లింకెన్ స్టాఫ్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. 2013-17 మధ్య జాన్ కెర్రీ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో బ్లింకెన్ డిప్యూటీ సెక్రెటరీగా వ్యవహరించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు స్పీచ్ రైటర్గా బ్లింకెన్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించడం విశేషం. ఇక ఆయన తండ్రికి హంగేరీలో అమెరికా రాయబారిగా పనిచేసిన అనుభవం ఉంది.
భారత్తో అణు ఒప్పందంలో కీలక పాత్ర..
ఇలా విదేశాంగ శాఖలో అనుభవం గడించిన బ్లింకెన్.. బైడెన్ విదేశాంగ విధానాన్నిరూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పశ్చిమాసియా, చైనా, ఐరోపా, ఇరాన్, భారత్తో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలన్న విషయంపై బైడెన్ ఆలోచనలకు ఓ రూపునిచ్చారు. ఒబామా హయాంలో బారత్-అమెరికా మధ్య కుదిరిన అణు ఒప్పందం సమయంలో సొంత పార్టీ డెమొక్రాటిక్ సభ్యుల నుంచే భిన్నస్వరాలు వినిపించాయి. ఆ సమయంలో వారి మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో బ్లింకెన్ కీలక పాత్ర పోషించారు.
భారత్ లేకుండా కష్టం..
భారత్తో సంబంధాలపై బ్లింకెన్ పలు సందర్భాల్లో ఆయన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. గత వేసవిలో హడ్సన్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్తో బైడెన్ బంధం ఎలా ఉండనుందో వివరించారు. ‘‘భారత్తో సంబంధాల్ని బలోపేతం చేసుకోవడానికి బైడెన్ చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇండో-పసిఫిక్ ప్రాంత భవిష్యత్తుకు ఇది ఎంతో అవసరం. ప్యారిస్ ఒప్పందంలోకి భారత్ను తీసుకురావడంలో బైడెన్ యంత్రాంగం విశేష కృషి చేసింది. భారత్ చేరకపోయి ఉంటే ఆ ఒప్పందానికి అర్థమే ఉండేది కాదు. భారత్ ప్రమేయం లేకుండా అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం చూపడం అంత సులువు కాదు’’ అని భారత్పై బైడెన్ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
చైనా.. ఉమ్మడి ముప్పు..
దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్న చైనాతో ఇటు భారత్ అటు అమెరికా ఇరు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బ్లింకెన్ ఓ సందర్భంలో తెలిపారు. సరిహద్దులో దురాక్రమణతో భారత్పై ఒత్తిడి తెస్తే.. ఉత్పత్తి రంగంలో ఉన్న సానుకూలతలతో అమెరికాను చైనా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వాణిజ్యం విషయంలో అంతర్జాతీయ నిబంధనలకు తూట్లు పొడుస్తూ లబ్ధి పొందేందుకు డ్రాగన్ ప్రయత్నిస్తోందన్నారు. చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్-అమెరికా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆగస్టు 15న భారతీయ-అమెరికన్లు నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతూ బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యూహాత్మక పరిధిని దాటాలి..
అంతర్జాతీయంగా భారత పాత్రను పటిష్ఠం చేయడంలో అమెరికా సహకారం కొనసాగుతుందని బ్లింకెన్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు స్థానం కల్పించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తామన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. భారత్-అమెరికా మధ్య బంధం వ్యూహాత్మక పరిధిని దాటాలని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు