ఉద్యోగ సృష్టి పథకానికి ₹22,810 కోట్లు

కొవిడ్‌ నేపథ్యంలో నిరుద్యోగ సమస్యకు చెక్‌ పెట్టి కొత్తగా ఉద్యోగాలు సృష్టికి ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ పథకానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఈ పథకం అమలుకు రూ.22,810 కోట్లు కేటాయిస్తున్నట్లు.......

Published : 09 Dec 2020 17:27 IST

దేశవ్యాప్త వైఫై పథకానికి ఆమోదం
పలు నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్‌

దిల్లీ: కొవిడ్‌ నేపథ్యంలో నిరుద్యోగ సమస్యకు చెక్‌ పెట్టి కొత్తగా ఉద్యోగాలు సృష్టికి ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ పథకానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఈ పథకం అమలుకు రూ.22,810 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,584 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఆమోదం లభించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, సంతోష్‌ గంగ్వార్‌ వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజనలో భాగంగా కొత్తగా ఉద్యోగాలు కల్పించిన సంస్థలు, పరిశ్రమల తరఫున ఉద్యోగి, సంస్థ వాటాను కేంద్రమే భరిస్తుందని, 2023 వరకు ఈ పథకం అమలు చేస్తామని సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. దీనివల్ల 58.5 లక్షల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందన్నారు.

దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వైఫై నెట్‌వర్క్‌ విస్తరణకు ఉద్దేశించిన పీఎం వాణి (వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ఫేస్‌) పథకానికీ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. దేశంలో వైఫై విప్లవం తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కోటి డేటా సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వైఫై కోసం ఎలాంటి లైసెన్సులూ, రిజిస్ట్రేషన్లు ఉండబోవని చెప్పారు. దీంతో పాటు సముద్రం లోపల నుంచి సబ్‌మైరెన్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ద్వారా లక్షద్వీప్‌లో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకోసం రూ.1,072 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలోని రెండు జిల్లాల్లో విస్తృత మొబైల్‌ కవరేజీకి ఉద్దేశించిన యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌)కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 2,374 గ్రామాలకు మొబైల్‌ కవరేజీ అందించనున్నారు. 2022 డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి..
..వారి ఈపీఎఫ్‌ను కేంద్రమే చెల్లిస్తుంది
రూ.6 లక్షల కోట్లు దాటిపోతుంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు