ఉద్యోగ సృష్టి పథకానికి ₹22,810 కోట్లు
కొవిడ్ నేపథ్యంలో నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టి కొత్తగా ఉద్యోగాలు సృష్టికి ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన’ పథకానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఈ పథకం అమలుకు రూ.22,810 కోట్లు కేటాయిస్తున్నట్లు.......
దేశవ్యాప్త వైఫై పథకానికి ఆమోదం
పలు నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
దిల్లీ: కొవిడ్ నేపథ్యంలో నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టి కొత్తగా ఉద్యోగాలు సృష్టికి ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన’ పథకానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఈ పథకం అమలుకు రూ.22,810 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,584 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, సంతోష్ గంగ్వార్ వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనలో భాగంగా కొత్తగా ఉద్యోగాలు కల్పించిన సంస్థలు, పరిశ్రమల తరఫున ఉద్యోగి, సంస్థ వాటాను కేంద్రమే భరిస్తుందని, 2023 వరకు ఈ పథకం అమలు చేస్తామని సంతోష్ గంగ్వార్ తెలిపారు. దీనివల్ల 58.5 లక్షల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందన్నారు.
దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వైఫై నెట్వర్క్ విస్తరణకు ఉద్దేశించిన పీఎం వాణి (వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్) పథకానికీ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో వైఫై విప్లవం తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కోటి డేటా సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వైఫై కోసం ఎలాంటి లైసెన్సులూ, రిజిస్ట్రేషన్లు ఉండబోవని చెప్పారు. దీంతో పాటు సముద్రం లోపల నుంచి సబ్మైరెన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా లక్షద్వీప్లో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకోసం రూ.1,072 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని రెండు జిల్లాల్లో విస్తృత మొబైల్ కవరేజీకి ఉద్దేశించిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,374 గ్రామాలకు మొబైల్ కవరేజీ అందించనున్నారు. 2022 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్ వెల్లడించారు.
ఇవీ చదవండి..
..వారి ఈపీఎఫ్ను కేంద్రమే చెల్లిస్తుంది
రూ.6 లక్షల కోట్లు దాటిపోతుంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్