ఈ స్టార్స్.. కొవిడ్ను జయించారు
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా అతలాకుతలమయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా సహా దాదాపు అన్ని దేశాల్లో ఈ వైరస్ విజృంభించింది. సామాన్యుల నుంచి ప్రపంచ స్థాయి ప్రముఖుల వరకు కోట్లాది మంది కొవిడ్ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా మూడున్నర కోట్ల
ఇంటర్నెట్డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా అతలాకుతలమయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా సహా దాదాపు అన్ని దేశాల్లో ఈ వైరస్ విజృంభించింది. సామాన్యుల నుంచి ప్రపంచ స్థాయి ప్రముఖుల వరకు కోట్లాది మంది కొవిడ్ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా మూడున్నర కోట్ల మందికి పైగా వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. అయితే మానసిక ధైర్యం, వైద్య చికిత్సతో వీరిలో చాలా మంది కొవిడ్ నుంచి క్షేమంగా బయటపడుతున్నారు. వైరస్ నుంచి కోలుకున్న రాజకీయ, క్రీడా, సినీ రంగాలకు చెందిన ఎంతో మంది అంతర్జాతీయ ప్రముఖుల గురించి ఓ సారి తెలుసుకుందాం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ఇటీవలే కొవిడ్ బారిన పడ్డారు. తమకు వైరస్ పాజిటివ్ వచ్చినట్లు ట్రంప్ ఈ నెల 1న ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం వీరు సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. |
బ్రిటన్కు చెందిన ప్రముఖ నటుడు రాబర్ట్ పాటిన్సన్ సెప్టెంబర్ 3న కొవిడ్కు గురయ్యారు. దీంతో ఆయన నటిస్తున్న ‘ది బ్యాట్మన్’ చిత్ర నిర్మాణాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. |
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ ఈ ఏడాది జులైలో వైరస్ బారిన పడి కోలుకున్నారు. |
హాలీవుడ్ నటుడు డ్వేన్ ‘ది రాక్’ జాన్సన్ కూడా వైరస్ బారిన పడ్డారు. తనకు, తన భార్యాపిల్లలకు కొవిడ్ సోకినట్లు డ్వేన్ సెప్టెంబరు 2న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలే వారంతా వైరస్ నుంచి కోలుకున్నారు. |
ఈ ఏడాది జులైలో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో, ఆ తర్వాత ఆగస్టులో ఆయన పెద్ద కుమారుడు ఫ్లావియో బొల్సొనారో కొవిడ్కు గురయ్యారు. ప్రస్తుతం వారు కోలుకుని తిరిగి ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. |
ప్రపంచ స్థాయి స్ప్రింటర్, ఎనిమిదిసార్లు ఒలింపిక్ పతక విజేత ఉసెన్ బోల్డ్ కూడా గత ఆగస్టులో కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. |
అమెరికా నటుడు బ్రయన్ క్రాన్స్టన్ తనకు కొవిడ్ సోకినట్లు జులై 30న ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. |
ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ జూన్లో కొవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత కోలుకున్న జకోవిచ్ ఈ మధ్య యూఎస్ ఓపెన్ సహా పలు టోర్నమెంట్లలో ఆడాడు. |
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వైరస్ విజృంభించిన తొలినాళ్లలోనే కొవిడ్కు గురయ్యారు. వైరస్ సోకి ఏప్రిల్ 5న బోరిస్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులు ఇంటెన్సివ్ కేర్లో ఉన్న ఆయన.. మనోధైర్యంతో కరోనాను జయించారు. |
ఈ ఏడాది మార్చిలో ఆస్కార్ విజేత టామ్ హాంక్స్, ఆయన సతీమణి రీటా విల్సన్ కూడా కొవిడ్కు గురై.. కోలుకున్నారు. |
బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ ఛార్లెస్ మార్చి నెలలో కొవిడ్ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో స్కాట్లాండ్లోని ఆయన నివాసంలో ఛార్లెస్ ఏడు రోజుల పాటు స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. |
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సతీమణి సోఫీ కూడా మార్చిలోనే కరోనాకు గురయ్యారు. దీంతో ప్రధాని కుటుంబం రెండు వారాల పాటు స్వీయనిర్బంధంలోకి వెళ్లింది. ట్రూడో కూడా ఇంటి నుంచే విధులు నిర్వహించారు. ఆ తర్వాత కోలుకున్న సోఫీ.. ఇటీవల ప్లాస్మా దానం కూడా చేశారు. |
వీరే గాక, లైంగిక వేధింపుల కేసులో జైల్లో ఉన్న హాలీవుడ్ మాజీ నిర్మాత హార్వే వీన్స్టన్, మొనాకో రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆల్బర్ట్, స్పానిష్ ఒపేరా సింగ్ ప్లాసిడో డమింగో, మాజీ బాండ్ గర్ల్ ఓల్గా కురిలెంకో, బ్రిటిష్ నటుడు ఇడ్రిస్ ఎల్బా, యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ ఓబ్రెయిన్ తదితరులు కొవిడ్ నుంచి క్షేమంగా కోలుకున్నారు.
మనదేశంలోనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు రాజకీయ నేతలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ, క్రీడా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులు కరోనాను జయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు