బిన్ లాడెన్ను అలా మట్టుబెట్టాం: ఒబామా
అంతర్జాతీయ ఉగ్రవాది, అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్పై అమెరికా జరిపిన దాడిలో పాకిస్థాన్ నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. పాక్ మిలిటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్,
2011 నాటి కమాండో ఆపరేషన్ను గుర్తుచేసుకున్న మాజీ అధ్యక్షుడు
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది, అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్పై అమెరికా జరిపిన దాడిలో పాకిస్థాన్ నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. పాక్ మిలిటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్, అల్ఖైదాతో సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యమే అని, అలాంటప్పుడు పాక్ నుంచి మద్దతు ఎలా ఆశిస్తామని ఒబామా అభిప్రాయపడ్డారు. ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో ఒబామా పుస్తకం రాశారు. ఇందులో బిన్ లాడెన్ కోసం అమెరికా కమాండోలు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ గురించి సవివరంగా ప్రస్తావించారు. ఆ ఆపరేషన్ గురించి ఆయన మాటల్లోనే..
‘అబొట్టాబాద్లోని పాకిస్థానీ మిలిటరీ కంటోన్మెంట్ శివారులో గల ఓ సురక్షిత ప్రాంతంలో అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్నట్లు మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. లాడెన్పై దాడి చేయడానికి ఈ సమాచారం చాలనిపించి వెంటనే కార్యాచరణ మొదలుపెట్టాం. ఎలాంటి దాడి చేయగలమని నేను టామ్ డోనిలన్(అప్పటి జాతీయ భద్రతా సలహాదారు), జాన్ బ్రెన్నన్(అప్పటి సీఐఏ అధికారి)లను అడిగాను. అయితే లాడెన్పై మేం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని గోప్యంగా ఉంచడం మా ముందున్న సవాల్. ఎందుకంటే దీనిపై చిన్న సమాచారం లీకైనా గొప్ప అవకాశాన్ని కోల్పోతామని మాకు తెలుసు. అందుకే కేవలం ప్రభుత్వంలోని అత్యంత తక్కువ మందికి మాత్రమే ఈ రహస్య ఆపరేషన్ గురించి తెలిసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం.’
‘ఇక మాకున్న మరో అడ్డంకి పాకిస్థాన్. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశ ప్రభుత్వం మాకు సహకరిస్తున్నప్పటికీ.. పాక్ మిలిటరీలో కొన్ని అంతర్గత శక్తులకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సర్వీసెస్కు తాలిబన్, అల్ఖైదా ఉగ్రముఠాలతో సంబంధాలున్నాయన్నది బహిరంగరహస్యమే. కొన్ని సార్లు ఈ ముఠాలను ఆ దేశం భారత్, అఫ్గానిస్థాన్పై వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇక మరో విషయమేంటంటే.. బిన్లాడెన్ దాక్కున్న కాంపౌండ్ పాక్ మిలిటరీ కంటోన్మెంట్కు కేవలం కొన్ని మైళ్ల దూరంలోనే ఉంది. ఈ ఆపరేషన్ గురించి పాకిస్థానీలకు ఏదైనా చెబితే లాడెన్కు సమాచారం అందే అవకాశం ఉంది. అందుకే పాకిస్థానీలను ఇందులో భాగస్వాములను చేయొద్దని గట్టిగా నిర్ణయించుకున్నాం.’
‘సమాచారమంతా సేకరించిన తర్వాత చివరగా మా ముందున్న రెండు అవకాశాల గురించి చర్చించుకున్నాం. మొదటిది.. లాడెన్ ఉన్న కాంపౌండ్ను వైమానిక దాడులతో పూర్తిగా ధ్వంసం చేయాలి. రెండవది.. ప్రత్యేక కమాండో ఆపరేషన్. ఇందులో కొంతమంది కమాండోలు హెలికాప్టర్ ద్వారా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి, దాడి చేసి, ఆ దేశ పోలీసులు, మిలిటరీ స్పందించకముందే అక్కడి నుంచి తిరిగి రావాలి. రిస్క్ ఉన్నప్పటికీ నేను, జాతీయ భద్రతా బృందం రెండో అవకాశాన్ని ఎంచుకున్నాం. అయితే ఈ ఆపరేషన్ను ఆమోదించడానికి ఒకరోజు ముందు మీటింగ్లో హిల్లరీ క్లింటన్(అప్పటి విదేశాంగ మంత్రి) మాట్లాడుతూ.. ఈ ఆప్షన్ 51-49 శాతం పనిచేస్తుందని అన్నారు. రక్షణ మంత్రి రాబర్ట్ గేట్స్ కమాండో ఆపరేషన్ను వ్యతిరేకించి వైమానిక దాడులను పరిశీలిద్దామని చెప్పారు. ఇక ఉపాధ్యక్షుడు జో బైడెన్ కూడా వ్యతిరేకించారు. ఆపరేషన్ విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చివరకు నిఘా వర్గాల నుంచి అత్యంత స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకుని ఆపరేషన్ చేపట్టాం.’
‘కమాండో ఆపరేషన్ విజయవంతమైన తర్వాత జాతీయ, అంతర్జాతీయ నేతల నుంచి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నుంచి ఫోన్ వస్తే మాత్రం ఇబ్బంది తప్పదని భావించా. అనుకున్నట్లే ఆయన నుంచి కాల్ వచ్చింది. అయితే ఆపరేషన్పై ఆయన అభినందనలు తెలపడమేగాక, మద్దతు ప్రకటించడం సంతోషంగా అనిపించింది. లాడెన్ను మట్టుబెట్టడం మంచి విషయం అని జర్దారీ అన్నారు. తన భార్య బెనజీర్ భుట్టో ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురవడాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు’ అంటూ ఒబామా ఆనాటి ఘటనలను పుస్తకంలో రాసుకొచ్చారు.
అమెరికా ట్విన్ టవర్స్ కూల్చి దాదాపు 3000 మందిని పొట్టనబెట్టుకున్న అల్ఖైదా అధినేత ఒసామా బిన్లాడెన్ను 2011 మే 2న అమెరికా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. అబొట్టాబాద్ కంపౌండ్లో నక్కిన లాడెన్ను యూఎస్ నేవీ సీల్ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్ చేపట్టి మట్టుబెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు. -
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
Dubai Rains: దుబాయ్లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి మన దౌత్య కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది. -
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు