చైనా వ్యాక్సిన్: సమర్థతపైనా గోప్యతే..!
యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్కు చైనా పుట్టినిళ్లైన విషయం తెలిసిందే. అయితే, కరోనా విషయంలో పాటించినట్లే వ్యాక్సిన్ విషయంలోనూ చైనా గోప్యతను పాటిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వ్యాక్సిన్ సమర్థతను ప్రకటించని డ్రాగన్ సంస్థలు
ప్రజావినియోగం కోసం నియంత్రణ సంస్థల వద్దకు..
ఇంటర్నెట్ డెస్క్: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్కు చైనా పుట్టినిల్లు అన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా విషయంలో పాటించినట్లే వ్యాక్సిన్ విషయంలోనూ చైనా గోప్యతను పాటిస్తుందనే అనుమానం వ్యక్తమవుతోంది. కరోనా వ్యాక్సిన్లపై జరుగుతున్న ప్రయోగాల ఫలితాలను ప్రపంపవ్యాప్తంగా ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా, మానవ వినియోగానికి కీలకమైన మూడోదశ ప్రయోగ సమాచార విశ్లేషణలను కూడా అంతర్జాతీయ వ్యాక్సిన్ సంస్థలు ప్రకటిస్తున్నాయి. కానీ, చైనా కంపెనీలు మాత్రం తమ వ్యాక్సిన్ల ప్రయోగ సమాచారంపై గోప్యతను పాటిస్తున్నాయనే అభిప్రాయం నెలకొంది. అత్యవసర వినియోగం కింద లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తోన్న చైనా, ఇప్పటివరకు వ్యాక్సిన్ సమర్థతపై ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ప్రత్యర్థుల ప్రకటనలతో అప్రమత్తం..
గత కొన్నిరోజులుగా అంతర్జాతీయ వ్యాక్సిన్ కంపెనీలు ఆయా వ్యాక్సిన్ల సమర్థతపై మధ్యంతర విశ్లేషణ ఫలితాలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే మోడెర్నా, ఫైజర్, స్పుత్నిక్-వి, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు 90శాతం సమర్థత కలిగివున్నట్లు ప్రకటించాయి. వీటిలో కొన్ని అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇవ్వాలంటూ నియంత్రణ సంస్థలను సంప్రదిస్తున్నాయి.ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాల ప్రత్యర్థి కంపెనీల ప్రకటనలతో చైనా అప్రమత్తమైంది. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద దాదాపు పది లక్షల మందికి వ్యాక్సిన్ అందించిన చైనా, నేరుగా ప్రజా వినియోగం కోసం చైనీస్ నియంత్రణ సంస్థల వద్ద దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఈ సమాచారాన్ని చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్(సీఎన్బీజీ) సంస్థ వెల్లడించింది. అయితే, వ్యాక్సిన్ సమర్థత, ప్రభావంపై బాహ్యప్రపంచానికి అటు సీఎన్బీజీ, దాని మాతృసంస్థ సినోఫార్మ్లు ఎలాంటి సమాచారాన్ని అందుబాటులో ఉంచలేదు. కేవలం తమ వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని మాత్రమే ప్రకటించాయి. దీంతో మిగతా దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే చైనా వ్యాక్సిన్ సమర్థతను పోల్చలేకపోతున్నారు.
అత్యవసర వినియోగం కిందే పదిలక్షల మందికి..
సినోఫార్మ్ తయారు చేసిన రెండు వ్యాక్సిన్ల ప్రయోగాల సమాచారాన్ని చైనా నియంత్రణ సంస్థ నేషనల్ మెడికల్ ప్రాడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఎంపీఏ)కు అందజేశాయి. వీటి ఫలితాలను ఎన్ఎంపీఏ సమీక్షించనుందని సినోఫార్మ్ ఛైర్మన్ యాంగ్ షియోమింగ్ వెల్లడించారు. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద భారీస్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టిన చైనా, ఒకవేళ అనుమతి లభిస్తే మాత్రం ప్రజలకు అందుబాటులో ఉన్న రెండో దేశంగా నిలువనుంది. వ్యాక్సిన్ను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచిన దేశంగా రష్యా తొలిస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, నియంత్రణ సంస్థల అనుమతి లేకున్నా ఇప్పటివరకు పదిలక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సాధారణ ఉష్ణోగ్రతల వద్దే టీకా నిల్వ..!
చైనాకు చెందిన సినోఫార్మ్ అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్ల మూడో దశ ప్రయోగాలను 50వేల మందిపై ప్రయోగిస్తున్నట్లు సీఎన్బీజీ వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని పేర్కొంది. చైనాకు చెందిన మరో వ్యాక్సిన్ సంస్థ సినోవాక్ బయోటెక్ మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న ఒక వాలంటీర్ మరణించడంతో బ్రెజిల్లో కొంతకాలం ప్రయోగాలు నిలిపివేసింది. అయితే, సినోఫార్మ్ టీకాలను చైనా వ్యాప్తంగా భారీ సంఖ్యలో పంపిణీ చేస్తున్నారు. దీనిని నిల్వ ఉంచేందుకు సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతే సరిపోతున్నట్లు సినోఫార్మ్ వెల్లడించింది. ఇప్పటికే మలేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, యూఏఈ దేశాల్లో ప్రయోగాలు చేపట్టిన చైనా, ఆయా దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఇదిలాఉంటే, పలు అంతర్జాతీయ సంస్థలు ఆయా వ్యాక్సిన్ల సమర్థతలను వెల్లడిస్తున్న సమయంలో చైనా సంస్థల ఫలితాల వెల్లడి తప్పనిసరైంది. దీంతో త్వరలోనే చైనా వ్యాక్సిన్ల సమర్థతపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి..
చైనా టీకా: 10లక్షల మందికి పంపిణీ
ఆ రెండింటి కంటే ఆక్స్ఫర్డే బెటరేమో..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.