జిన్పింగ్ ‘క్లీన్ప్లేట్’ వెనుక కథ..!
చైనా ఏం చేసినా దానికో వ్యూహం ఉంటుంది.. పక్కా లెక్కుంటుంది.. గత వారం చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ ఆహార వృథాను తగ్గించుకోవాలని ప్రకటించారు. ఆహార వృథా సిగ్గుచేటని కఠిన వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్ చెప్పారంటే అక్కడ అది శిలాశాసనం.
భారీ కరవు దిశగా డ్రాగన్..?
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా ఏం చేసినా దానికో వ్యూహం ఉంటుంది.. పక్కాగా లెక్కుంటుంది.. గత వారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహార వృథాను తగ్గించుకోవాలని ప్రకటించారు. ఆహార వృథా సిగ్గుచేటని కఠిన వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్ చెప్పారంటే అక్కడ అది శిలాశాసనం. దీంతో దానిని అమలు చేయడం మొదలుపెట్టారు. దీని కోసం ఎన్-1 విధానం కూడా మొదలుపెట్టారు. అంతేకాదు ఫుడ్ యూట్యూబర్లపై ఆంక్షలు విధించారు. చాలా మంది చైనా అధికారులకు భయపడిపోయి తమ సామాజిక మాధ్యమాల్లోని వీడియోలను కూడా తొలగించడం మొదలుపెట్టారు. చైనాలో ఏదైనా ఉద్యమస్థాయిలో తీవ్రంగా అమలు చేస్తారు. దీంతో తాజాగా క్లీన్ప్లేట్ ఉద్యమం ఎటు పోతుందో అన్నది ఆందోళనకరంగా మారింది.
అసలు ఈ ‘క్లీన్ప్లేట్’ ఏమిటీ..?
ఆహార వృథాను అడ్డుకొనేందుకు తొలిసారి 2013లో ‘ఆపరేషన్ ఎమ్టీ ప్లేట్’ ప్రవేశపెట్టారు. అప్పట్లో సాధారణ ప్రజలకు కాకుండా అధికారులు.. ఇతర హైప్రొఫైల్ వ్యక్తులు మాత్రమే దీనిలో చేర్చారు. వీరు ఇచ్చే విందుల్లో ఆహార వృథా లేకుండా చూడాలనేది దీని లక్ష్యం. 2015లో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లెక్కల ప్రకారం 1.8కోట్ల టన్నుల ఆహారం చైనాలో వృథాగా పోతోంది. దీంతో దాదాపు 5 కోట్ల మందికి ఏడాదిపాటు ఆకలి తీర్చవచ్చు.
తాజాగా షీ జిన్పింగ్ వుహాన్లోని కేటరింగ్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ ఆహార వృథాను తగ్గించాలని ప్రతిపాదించారు. ‘ఆపరేషన్ క్లీన్ ప్లేట్’ 2.0ను ప్రతిపాదించారు. ఈ సారి సాధారణ ప్రజలను కూడా దీనిలో భాగస్వాములను చేశారు. రెస్టారెంట్లలో ఎన్-1 విధానం ప్రవేశపెట్టమని చెప్పారు. ఒక గ్రూపుగా వచ్చే వారు ఆర్డర్లో ఒకరికి తగ్గించాలి. అంటే 10 మంది వెళితే 9 మందికి సరిపడా ఆర్డరే ఇవ్వాలి. అంతేకాదు.. కస్టమర్లకు అవసరమైన విధంగా చిన్నచిన్న మొత్తంలో కూడా ఆర్డర్లను స్వీకరించాలని నిర్ణయించారు. పాఠశాలల్లో విద్యార్థులకు కూడా దీనిని చిన్నప్పటి నుంచే నేర్పించాలని నిర్ణయించారు.
గతంలో కోట్ల మంది మరణం..
చైనాకు మావో నేతృత్వం వహిస్తున్న సమయంలో దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే మొండి పట్టుదలతో గ్రేట్ లీఫ్ ఫార్వర్డ్ విధానం ప్రవేశపెట్టారు. ఫలితంగా ఆహార పంటలు తగ్గడం.. దీనికి ప్రకృతి విపత్తులు తోడుకావడంతో కోట్ల మంది మరణించారు. చరిత్రలో మనిషి సృష్టించిన మహాకరవుగా ఇది నిలిచిపోయింది.
ఇంత అత్యవసరంగా దేనికి..?
చైనాలో ఈ సారి ఆహారధాన్యాల కరవు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు చైనాలో గతేడాదితో పోలిస్తే గోధుమల సేకరణ 20శాతం తగ్గినట్లు సమాచారం. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కరవు అంశాన్ని కొట్టిపారేసింది. 120 కోట్ల కిలోల ధాన్యం అదనంగా పండించామని పేర్కొంది. కానీ దేశంలో చాలా చోట్ల ఈ ఏడాది భారీగా వరదలు ముంచెత్తడంతో కొంత నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ది గార్డియన్ కథనం ప్రకారం వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా నుంచి వచ్చే ఆహార దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. చైనా ఆహార అవసరాలను 30శాతం వరకు దిగుమతులే తీరుస్తాయి. మరోపక్క భారత్, వియత్నాంలు కరోనావైరస్ కారణంగా వరి ఎగుమతులపై ఆంక్షలు విధించాయి.
ఆహార సంక్షోభం ఖాయమా..?
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటన కంటే ముందే గత నెలలో ఫోర్బ్స్ ఓ కథనం ప్రచురించింది. దీనిలో చైనా ఆహార సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల కాలంలో చైనాలో ఆహారధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సప్లయ్లో ఒత్తిడిని ఎదుర్కొంటేనే ఈ విధంగా ధరలు పెరుగుతాయి. ఇటీవల కాలంలో యాంగ్జీ నదికి భారీగా వరదలు వచ్చాయి. చైనా భారీగా గోధుమలు ఉత్పత్తి చేస్తుంది. కానీ, ఈ ఏడాది తొలి అర్ధ భాగంలోనే గత పదేళ్లలో ఎన్నడు లేనంతగా గోధుములను దిగుమతి చేసుకొంది. మరోపక్క మొక్కజొన్నల ధరలు కూడా చైనాలో భారీగా పెరిగాయి. చైనా రిజర్వులోని మొక్కజొన్నలను విక్రయించిందంటే ఉత్పత్తిలో కోతపడినట్లే కదా. అంతేకాదు గత కొన్ని నెలలుగా చైనా భారీ మొత్తంలో పందిమాంసం, సోయాబీన్, సోయా మీల్, గోధుమలు, మొక్కజొన్న, నిల్వ ఆహారంను దిగుమతి చేసుకుంది. చైనాలో ఆహార కొరత వస్తే దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. చైనా ప్రభుత్వ అధినాయకత్వం తొలి ప్రాధాన్యం కూడా ఆహార భద్రతే. అందుకే ఇప్పుడు ‘క్లీన్ప్లేట్ ’ ఉద్యమాన్ని మొదలుపెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు