Joe Biden: తాలిబన్లతో వేగడం అంత సులభం కాదు
రెండు దశాబ్దాల యుద్ధంలో తాలిబన్ల చేతిలో అమెరికా పరాజయం పాలైందని సంతోషపడుతున్న చైనా, పాకిస్థాన్, రష్యాలకు తాలిబన్లు పెనుసవాలుగా మారే
వారితో చైనాకు పెద్ద సమస్యే
పాకిస్థాన్, రష్యా పరిస్థితీ అంతే
అఫ్గాన్ పరిణామాలపై బైడెన్ సునిశిత వ్యాఖ్యలు
వాషింగ్టన్: రెండు దశాబ్దాల యుద్ధంలో తాలిబన్ల చేతిలో అమెరికా పరాజయం పాలైందని సంతోషపడుతున్న చైనా, పాకిస్థాన్, రష్యాలకు తాలిబన్లు పెనుసవాలుగా మారే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడుతోంది. తాలిబన్లతో డ్రాగన్కు పెద్ద సమస్యే ఉత్పన్నం కానుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అఫ్గాన్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాలిబన్లతో వేగడం అంత సులభం కాదన్నారు. ఈ సమస్యను చైనా.. ఇతర దేశాలు ఎలా అధిగమిస్తాయో వేచి చూడాలని తెలిపారు. ‘‘ఒక్క చైనాకే కాదు.. పాకిస్థాన్, ఇరాన్, రష్యాకూ ఇదే సమస్య. దీన్ని వారు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే’’ అని తెలిపారు. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడంపై అమెరికా ఆచితూచి స్పందించింది. ఒక్క మహిళకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టింది. తాము ఉగ్రవాదులుగా పరిగణించిన వ్యక్తులకు ప్రభుత్వంలో చోటు కల్పించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘తాలిబన్ మాటలను పట్టించుకోం. వారి చేతలను చూసే ఒక అంచనాకు వస్తాం. అఫ్గాన్ ప్రజలకు సమ్మిళిత ప్రభుత్వం కావాలి. ఆ విషయాన్ని ఇప్పటికే వారికి స్పష్టం చేశాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. జర్మనీ కూడా ఇదే తరహాలో స్పందించింది. ‘‘తాలిబన్ ప్రభుత్వంలో అఫ్గాన్ సమాజంలోని వివిధ తెగలకు ప్రాతినిధ్యం కల్పించలేదు అంతేకాదు.. కాబుల్లో మహిళలు జరిపిన ర్యాలీలోనూ హింస చోటు చేసుకుంది. పరిస్థితులు ఆశావహంగా కనిపించడం లేదు’’ అని జర్మనీ విదేశాంగ మంత్రి హీకో మాస్ నిరాశ వ్యక్తం చేశారు.
గుర్తించాల్సింది మేం కాదు.. సభ్యదేశాలే: ఐరాస
తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించే బాధ్యత తమది కాదని ఐక్యరాజ్యసమితి తెలిపింది. దీనిపై సభ్య దేశాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ‘‘ప్రభుత్వాలకు గుర్తింపునిచ్చే అంశంపై ఐరాస చర్చలు జరపదు. అది సభ్యదేశాలు చేసే పని. అఫ్గాన్ పౌరుల హక్కులు, ముఖ్యంగా మహిళలు, యువతుల హక్కులను కాపాడేలా.. శాంతియుతమైన పరిష్కారానికి ఐరాస కట్టుబడి ఉంది. ప్రాణాలు కాపాడేందుకు, మానవతా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటుంది’’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఉప ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు.
తాలిబన్లకు చైనా రూ.229 కోట్ల సాయం
బీజింగ్: తాలిబన్లపై చైనా అపార ప్రేమను చూపిస్తోంది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును స్వాగతించిన డ్రాగన్ మరో ముందడుగు వేసింది. రూ. 229 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ సాయంలో భాగంగా ఆ దేశానికి ఆహార ఉత్పత్తులు, వ్యాక్సిన్లు, ఔషధాలు సరఫరా చేస్తామని పేర్కొంది. బుధవారం అఫ్గానిస్థాన్ పొరుగు దేశాల విదేశాంగ మంత్రులతో పాకిస్థాన్ ఏర్పాటు చేసిన సమావేశంలో చైనా ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ భేటీలో ఇరాన్, తజకిస్థాన్, తుర్కెమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ పాల్గొన్నాయి. రష్యా హాజరుకాలేదు. అంతకుముందు తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వంపై చైనా ప్రశంసల వర్షం కురిపించింది. ప్రభుత్వ ఏర్పాటుతో మూడు వారాలుగా ఆ దేశంలో కొనసాగుతున్న అరాచకానికి తెరపడిందని సంతృప్తి వ్యక్తం చేసింది. దేశీయంగా పరిస్థితులను చక్కదిద్దడానికి, సామాజిక, ఆర్థిక వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశామని తాలిబన్లు ప్రకటించడాన్ని కూడా చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెనెబిన్ స్వాగతించారు. మరి తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నారా.. అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మాత్రం వాంగ్ సమాధానం చెప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది.
తాజా వార్తలు (Latest News)
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ