పబ్జీపై నిషేధం.. చైనా తీవ్ర ఆందోళన!
సరిహద్దుల్లో దుస్సాహసాలకు పాల్పడుతున్న డ్రాగన్ను దెబ్బకొట్టేలా పబ్జీ సహా 118 యాప్లను భారత్ నిషేధించడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది...........
బీజింగ్: సరిహద్దుల్లో దుస్సాహసాలకు పాల్పడుతున్న డ్రాగన్ను దెబ్బకొట్టేలా పబ్జీ సహా 118 యాప్లను భారత్ నిషేధించడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. భారత్ చర్యలు చైనా పెట్టుబడిదారులు, సర్వీస్ ప్రొవైడర్ల చట్టబద్ధమైన ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని మండిపడింది. ఈ మేరకు చైనా వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గో ఫెంగ్ మీడియాతో మాట్లాడారు. ఈ తప్పును భారత్ సరిచేసుకోవాలని చైనా కోరుకుంటోందని తెలిపారు.
యువతలో విశేష ఆదరణ పొందిన ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీ సహా మొత్తం 118 యాప్లపై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దేశ సార్వభౌమత్వం, రక్షణకు ఇవి ముప్పుగా ఉన్నందువల్లే వేటు వేసినట్టు స్పష్టంచేసింది. జూన్ నెలలో గల్వాన్ వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో టిక్టాక్, యూసీ బ్రౌజర్ సహా వందకు పైగా చైనా యాప్లపై భారత్ నిషేధం విధించగా.. తాజాగా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో 118 యాప్లను నిషేధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా