టీకాపై నమ్మకం: తంటాలుపడుతోన్న చైనా!
యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన చైనా ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం సన్నగిల్లిందన్న వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
బీజింగ్: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన చైనా ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం సన్నగిల్లిందన్న వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే వరుసలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్లకు కూడా ప్రపంచవ్యాప్తంగా గిరాకీ లేకుండా పోతుందనే వార్తలు ఎక్కువయ్యాయి. పలు వ్యాక్సిన్లు ప్రయోగదశల్లో ఉండగానే వివిధ దేశాలు ఒప్పందాలు కుదుర్చుకుంటోన్న వేళ.. చైనా వ్యాక్సిన్వైపు మాత్రం చాలా దేశాలు అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్పై నమ్మకాన్ని కలిగించేందుకు డ్రాగన్ దేశం తంటాలుపడుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చైనా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు పలు అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో కొనసాగుతున్నాయి. చైనాకు సన్నిహితంగా మెలుగుతోన్న పాకిస్థాన్లోనూ చైనాకు చెందిన రెండు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడి సీనియర్ ప్రభుత్వాధికారులకు కూడా చైనా టీకాలను అందిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్తో పాటు ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనూ చైనా వ్యాక్సిన్పై ప్రయోగాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆయా దేశాల్లో వ్యాక్సిన్పై నమ్మకాన్ని సాధించడంలో చైనా విఫలమైనట్లు పలు సర్వేలు, నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక పాకిస్థాన్ ప్రజలు కూడా చైనా వ్యాక్సిన్పై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
అనుమానాలు వ్యక్తంచేస్తోన్న బ్రెజిల్ అధ్యక్షుడు..
చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ప్రయోగాలను దాదాపు 16దేశాల్లో కొనసాగిస్తోంది. బ్రెజిల్, టర్కీ, ఫిలిప్పైన్స్, మొరాకో, అర్జెంటీనా, పాకిస్థాన్, మెక్సికో, సౌదీ దేశాల్లో ప్రయోగాలు కొనాసాగుతున్నాయి. అయితే బ్రెజిల్లో నిర్వహిస్తోన్న ప్రయోగాల్లో చైనా వ్యాక్సిన్ కేవలం 50శాతానికిపైగా సమర్థత చూపించిందని బ్రెజిల్ అధికారులు వెల్లడించారు. అయితే, కరోనా వ్యాక్సిన్ సమర్థతపై ఇంకా స్పష్టమైన అధికారిక ప్రకటన మాత్రం బయటకు రాలేదు. దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కూడా బహిరంగంగానే వ్యతిరేకించారు. చైనాలో తయారయ్యే వ్యాక్సిన్లపై తనకు నమ్మకం లేదని.. వ్యాక్సిన్లను చైనా నుంచి కొనబోమని ఈమధ్యే అక్కడి మీడియాలో స్పష్టంచేశారు. అయితే, బ్రెజిల్లో కొన్నిరాష్ట్ర గవర్నర్లు మాత్రం చైనా వ్యాక్సిన్పై సానుకూలంగానే ఉన్నారు. తాజాగా బ్రెజిల్లో జరిపిన ఓ ప్రైవేటు సర్వేలోనూ చైనా వ్యాక్సిన్ను తీసుకోబోమని సర్వేలో పాల్గొన్న సగంమంది అభిప్రాయపడ్డారు. ఇక కెన్యాలో జరిపిన మరో సర్వేలోనూ చైనా, రష్యాలో తయారైన వ్యాక్సిన్లపై మెజారిటీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. యూకే, అమెరికా వ్యాక్సిన్లపైనే వారు మొగ్గుచూపారు. హాంగ్కాంగ్ ప్రజలు కూడా చైనా వ్యాక్సిన్ ఒక్కటే కాకుండా ఫైజర్, సినోవాక్, ఆస్ట్రాజెనెకాకు చెందిన టీకాల్లో ఇష్టమైన దాన్ని తీసుకోవచ్చని స్థానిక అధికారులు ప్రకటించారు.
పేద దేశాలే దిక్కు..
చైనా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను ఇప్పటికే అక్కడ లక్షల మందికి అందిస్తోంది. ఇప్పటివరకు కేవలం చైనా, యూఏఈలలో మాత్రమే చైనా వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కింద అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా ఉత్పత్తులపై నమ్మకం మరింత సన్నగిల్లడంపై ఆ ప్రభావం వ్యాక్సిన్లపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో చైనాకు కేవలం పేద దేశాల మద్దతు మాత్రమే లభిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, రష్యా, బ్రిటన్ తయారుచేసిన వ్యాక్సిన్లు ఆఫ్రికా వంటి పేద దేశాలకు అందుబాటులో లేకపోవడంతో చైనా వ్యాక్సిన్పైనే ఆధారపడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా వ్యాక్సిన్ల సమర్థతపై సమాచారం లేకపోవడం కూడా ఇందుకు మరో కారణంగా నిపుణులు భావిస్తున్నారు. వీటికి ముందు కరోనా విజృంభణ ప్రారంభమైన సమయంలోనూ చైనా అభివృద్ధి చేసిన నాణ్యతలేని కరోనా టెస్టు పరికరాలు, పీపీఈ కిట్ల వచ్చిన వార్తలు చైనా ఉత్పత్తులపై అపనమ్మకాన్ని మరింత పెంచినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
చైనా లెక్కలు ఏంటంటే..!
చైనా వ్యాక్సిన్ను మార్కెటింగ్ చేసుకోవడంలో భాగంగా ఆఫ్రికాకు చెందిన దాదాపు 50దేశాల రాయబారులను వ్యాక్సిన్ తయారుచేస్తోన్న సినోఫార్మ్ కేంద్రానికి చైనా తీసుకెళ్లింది. వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తై, సురక్షితమని తేలిన వెంటనే ఆఫ్రికన్ దేశాలకు వ్యాక్సిన్ అందిస్తామని చైనా విదేశాంగశాఖ ఈమధ్యే వెల్లడించింది. అంతేకాకుండా చాలావరకు అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో వ్యాక్సిన్ తయారీ లేకపోవడం కలిసివస్తుందని చైనా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫైజర్ వంటి వ్యాక్సిన్లను నిల్వ చేసుకునే సౌలభ్యం కూడా చాలా దేశాలకు లేదని చైనా భావిస్తోంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో వివిధ సంస్థలు కలిసి ఏర్పడిన కోవాక్స్ కూటమీకి వ్యాక్సిన్ అందించేందుకు చైనా అంగీకరించింది. దీంతో వ్యాక్సిన్ సరఫరాకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని పేర్కొంటోంది.
ఇదిలాఉంటే, కరోనా వైరస్ తొలుత బయటపడిన చైనాలో.. వైరస్ వ్యాప్తిని చాలావరకు సాధ్యమైనంత తొందరగానే నియంత్రించగలిగింది. కానీ, కరోనా మూలాలు, హాంగ్కాంగ్, షిన్జియాంగ్ వంటి విషయాల్లో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కయ్యానికి కాలుదువ్వింది. ఇటు భారత్తోనూ ఘర్షణ వాతావరణాన్నే కొనసాగిస్తోంది. దీంతో చాలా దేశాలు చైనా ఉత్పత్తులపై విముఖత చూపిస్తున్నాయి. అదేసమయంలో చైనా ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగినట్లు పలు నివేదికలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్పై నమ్మకం కలిగించేందుకు చైనా శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
కొవిడ్ 19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు..!
చైనా వ్యాక్సిన్: సమర్థతపైనా గోప్యతే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?