చందమామపై చైనా జెండా
జాబిల్లి నుంచి నమూనాలను తెచ్చేందుకు మానవాళి యత్నించడం గత 40ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు అమెరికా చంద్రుడి నమూనాలను తెచ్చేందుకు వ్యోమగాములను పంపింది. 1969లో చేపట్టిన ఆ ప్రయోగంతోనే తొలిసారిగా
అమెరికా తర్వాత 50ఏళ్లకు జాబిల్లిపై మరో పతాకం
బీజింగ్: దాదాపు 50ఏళ్ల తర్వాత జాబిల్లిపై మరో దేశ జెండా రెపరెపలాడింది. చంద్రుడి ఉపరితలంపై నమూనాలను సేకరించడానికి వెళ్లిన చైనా వ్యోమనౌక అక్కడ తమ జాతీయజెండాను ఎగురవేసింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను చాంగే-5 మానవ రహిత వ్యోమనౌక తన కెమెరాలో బంధించింది. 2 మీటర్ల వెడల్పు, 90 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఈ జెండా ఫొటోలను చైనా జాతీయ అంతరిక్ష కేంద్రం విడుదల చేసింది. చంద్రుడి మట్టిని సేకరించి తిరిగి భూమికి బయల్దేరే ముందు చాంగే-5 డ్రాగన్ జెండాను జాబిల్లి ఉపరితలంపై పాతింది.
జాబిల్లి ఉపరితలం నమూనాలను సేకరించి, భూమికి రప్పించేందుకు చైనా గత మంగళవారం సంక్లిష్ట అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. చాంగే-5 వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. వెంచాంగ్ రోదసి కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-5 రాకెట్ ద్వారా డ్రాగన్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 8 టన్నుల బరువున్న చాంగే-5లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే నాలుగు స్వతంత్ర భాగాలున్నాయి. ఈ వ్యోమనౌక చంద్రుడి నమూనాలను తీసుకుని గురువారం మధ్యాహ్నం తిరిగి భూమికి బయల్దేరినట్లు చైనా అంతరిక్ష సంస్థ వెల్లడించింది.
కాగా.. జాబిల్లి నుంచి నమూనాలను తెచ్చేందుకు మానవాళి యత్నించడం గత 40ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు అమెరికా చంద్రుడి నమూనాలను తెచ్చేందుకు వ్యోమగాములను పంపింది. 1969లో చేపట్టిన ఆ ప్రయోగంతోనే తొలిసారిగా మానవుడు చంద్రుడిపై కాలుమోపాడు. జాబిల్లిపై దిగిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అమెరికా జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత చందమామపై మరో దేశ జెండగా ఎగిరింది ఇప్పుడే కావడం విశేషం. ఇక అమెరికా తర్వాత సోవియట్ యూనియన్ మాత్రం మానవరహిత వ్యోమనౌకలను ప్రయోగించింది. అమెరికా, సోవియట్ యూనియన్ పంపిన వ్యోమనౌకలు చంద్రుడిపై శాంపిళ్లను సేకరించి విజయవంతంగా భూమిని చేరుకున్నాయి. ఇప్పుడు చాంగే-5 క్షేమంగా భూమికి తిరిగొస్తే ఈ ఘనత సాధించిన మూడో దేశంగా చైనా నిలుస్తుంది.
జాబిల్లి నమూనాల సేకరణ ఇలా..
> చంద్రుడి ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చాంగే-5 చేరింది. ఆ తర్వాత ల్యాండర్-అసెండర్లు సంయుక్తంగా విడిపోయి.. జాబిల్లి ఉపరితలంపైకి దిగాయి. ఆర్బిటర్-రిటర్నర్లు కక్ష్యలోనే ఉండిపోయాయి. అవి డాకింగ్ కేంద్ర బాధ్యతలను నిర్వహిస్తాయి.
> ల్యాండర్-అసెండర్లు చంద్రుడి వాయవ్య ప్రాంతంలోని ‘ఓషెనస్ ప్రొసెల్లారమ్’ అనే ప్రాంతంలో దిగాయి. ల్యాండర్లోని రోబో హస్తం.. చంద్రుడి ఉపరితలంపై రెండు మీటర్ల మేర డ్రిల్లింగ్ చేపట్టి రెండు కిలోల శిలలు, మట్టి నమూనాలను సేకరించింది. వాటిని అసెండర్లోకి చేరవేసింది.
> అనంతరం అసెండర్.. నమూనాలతో సహా నింగిలోకి వెళ్లి కక్ష్యలో ఉన్న ఆర్బిటర్-రిటర్నర్తో సంధానమైంది. నమూనాలను రిటర్నర్లోకి చేరవేసింది.
> చంద్రుడి రాళ్లు, మట్టిని తీసుకొని రిటర్నర్ భూమికి బయల్దేరింది. '
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి