చైనా చర్యలు రెచ్చగొట్టేవే..!
భారత సరిహద్దు ప్రాంతమైన లద్దాఖ్లో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్లు వస్తోన్న వార్తలపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
సరిహద్దు నిర్మాణాలపై అమెరికా చట్టసభ సభ్యుల ఆందోళన
వాషింగ్టన్: భారత సరిహద్దు ప్రాంతమైన లద్దాఖ్లో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్లు వస్తోన్న వార్తలపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ వార్తలే నిజమైతే, అవి కచ్చితంగా భారత్ను రెచ్చగొట్టే చర్యలేనని, దక్షిణ చైనా సముద్రంలో అవలంబిస్తోన్నట్లుగానే ఇక్కడ కూడా చైనా ప్రవర్తిసున్నట్లు వెల్లడించారు. సరిహద్దులో నిర్మాణాలపై శాటిలైట్ చిత్రాలు వెలువడ్డ నేపథ్యంలో భారత సంతతికి చెందిన అమెరికా చట్టసభ సభ్యులు చైనా తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.
‘సరిహద్దు ప్రాంతంలో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్లు వస్తోన్న వార్తలు నిజమే అయితే, వాస్తవాలను మారుస్తూ.. చైనా సైన్యం భారత్ను రెచ్చగొట్టే మరో చర్యే’ అని డెమొక్రాటిక్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మీడియాతో పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించే ఉద్దేశంతో దక్షిణ చైనా సముద్రంలోనూ చైనా ఇదే విధమైన నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. ఇంటెలిజెన్స్పై అమెరికా చట్టసభ ఏర్పాటు చేసిన శాశ్వత కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న రాజా కృష్ణమూర్తి, చైనా చర్యలపై ఆందోళన వ్యక్తంచేశారు. భారత సంతతికి చెందిన కృష్ణమూర్తి అమెరికాలో జరిగిన తాజా ఎన్నికల్లో ప్రతినిధుల సభకు వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు.
భారత్కే మద్దతు..
ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగానే ఎన్నికైన నూతన అధ్యక్షుడి హయాంలోనూ అమెరికా, భారత్కే మద్దతుగా ఉంటుందని రాజా కృష్ణమూర్తి స్పష్టంచేశారు. జో జోబైడెన్ భారత్కు చిరకాల మిత్రుడని, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా భారత్ వెంటే ఉంటారని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, బైడెన్ ప్రభుత్వంలో నూతన విదేశాంగ మంత్రిగా నియమించబడ్డ ఆంటోని బ్లింకెన్ భారత్కు మంచి స్నేహితుడని, ఆయనకు ఈ ప్రాంత విషయాలపై మంచి పట్టు ఉందని పేర్కొన్నారు. వీరి నేతృత్వంలో భారత్తో అమెరికా సంబంధాలు మరింత దృఢ పడతాయనే విశ్వాసాన్ని రాజా కృష్ణమూర్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైనాతో సహా ఇలాంటి చర్యలకు పాల్పడే మరే పొరుగు దేశాన్నైనా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాల మధ్య గత మే నెలనుంచి ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాలు భారీ సంఖ్యలో బలగాలను మోహరించాయి. అయితే, ఇప్పటికే ఇరుదేశాల సైనికాధికారులు వీటిపై పలుసార్లు చర్చలు జరిపినప్పటికీ పరిస్థితులు మాత్రం కొలిక్కిరాలేదు.
ఇదిలా ఉంటే, దాదాపు 13లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని చైనా తన భూభాగంగానే ప్రకటించుకుంటోంది. అంతేకాకుండా అక్కడ కృత్రిమ ద్వీపాలను సృష్టిస్తూ..మిలటరీ బేస్లను కూడా నిర్మిస్తోంది. అయితే, ఇవి తమ భూ భాగాలేనంటూ బ్రూనై, మలేసియా, ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాంలు పేర్కొంటున్నాయి. ఇక వియత్నాం, ఫిలిప్పైన్స్ దేశాలు చేపట్టే చేపల వేట, ఖనిజాల అన్వేషణ వంటి కార్యకలాపాలను చైనా అడ్డుకుంటోంది. వందల సంవత్సరాలుగా ఈ భూభాగంపై హక్కులు తమవేనని చైనా వాదిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?