చైనాకు మరోషాక్.. పబ్జీపై కేంద్రం నిషేధం
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. డ్రాగన్ దేశానికి చెందిన మరో 118 మొబైల్ యాప్లపై .........
దిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. డ్రాగన్ దేశానికి చెందిన మరో 118 మొబైల్ యాప్లపై నిషేధం విధించింది. వీటిలో పబ్జీ, క్యామ్ కార్డ్, బైడు, కట్ కట్ సహా మొత్తం 118 యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతంలో గల్వాన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల సమయంలో టిక్టాక్ సహా 59 యాప్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సరిహద్దులో తాజాగా చోటుచేసున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయనే కారణంతో మరికొన్ని చైనా యాప్లపైనా కేంద్రం వేటు వేసింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ఫాంలపై లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్లు తమ సమాచారాన్ని అనధికారికంగా సేకరించి దేశం వెలుపల ఉన్న సర్వర్లకు రహస్యంగా చేరవేస్తున్నట్టు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐటీ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
పబ్జీకి ఎందుకంత క్రేజ్..
పోరాటాల ఆటలంటే ఇష్టపడేవారికి పబ్జీ ఓ విందు భోజనంలా ఉంటుంది. ఇందులో వంద మంది కలసి ఓ ప్రాంతంలో దిగి... తుపాకీలతో పోరాడి చివరికి నిలిచేవాడు విజేత అవుతాడు. బృందంతో ఆడితే బృందం విజేతగా నిలుస్తుంది. గెలిచినవారికి చికెన్ డిన్నర్ లభిస్తుంది. అంటే అదేదో గిఫ్ట్ అనుకోవడానికి వీల్లేదు.. ‘విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్’ అనే ఓ పోస్టర్ పడుతుంది. గన్లు, బాంబులు, కార్లు, బైక్లు, ఛేజింగ్లు, ఫైరింగ్ లాంటివి ఉండటంతో ఈ ఆట అంటే యువత తెగ ఇష్టపడుతుంది. దీనికోసమే స్మార్ట్ ఫోన్లు కొనుకున్న యువత కూడా ఉన్నారని ఇటీవల వార్తలు కూడా చదివాం. తొలుత ప్లే స్టేషన్ల, కంప్యూటర్లలో అందుబాటులో ఉన్న ఈ ఆట... ఫిబ్రవరి 9, 2018న మొబైల్ వెర్షన్లో మన దేశంలో లాంచ్ చేశారు. విడుదలైన తొలి ఏడాదే ప్లే స్టోర్లో ఉత్తమ యాప్గా నిలిచింది. ఆ తర్వాత లో ఎండ్ మొబైల్స్ కోసం 2019 ఆగస్టులో పబ్జీ లైట్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
పబ్జీకి ప్రపంచంలోనే కాదు భారత్లోనూ విశేష ఆదరణ ఉంది. ముఖ్యంగా యువత ఈ ఆటపట్ల ఎంతో ఆసక్తి కనబరిచారు. ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ ఆటలోనే మునిగిపోతారు. ఒక్క భారత్లోనే 50మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్నాయంటే పబ్జీకి ఉన్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నెలలపాటు ఈ ఆడటం కోసం నిద్రాహారాలు మాని అనేకమంది ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పబ్జీ గేమ్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా బ్రెండన్ గ్రీన్, జాంగ్ టె-సియాక్ ఉన్నారు. 2000 సంవత్సరంలో జపనీస్ చిత్రం బ్యాటిల్ రాయల్ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు.
కేంద్రం నిషేధించిన 118 మొబైల్ యాప్లు ఇవే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు