‘సుధామూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలా?’

ఓ వెబ్‌ సిరీస్‌లో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. వెబ్‌ సిరీస్‌ నిర్వాహకులపై నమ్మ కర్ణాటక రక్షణ వేదిక నేత లయన్‌ .........

Published : 26 Oct 2020 21:28 IST

వెబ్‌సిరీస్‌ దర్శకుడు, నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు 

బెంగళూరు: ఓ వెబ్‌ సిరీస్‌లో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. వెబ్‌ సిరీస్‌ నిర్వాహకులపై నమ్మ కర్ణాటక రక్షణ వేదిక నేత లయన్‌ జయరాజ్‌ నాయుడు నందిని లే అవుట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనేక సేవా కార్యక్రమాలతో కర్ణాటకకు గర్వకారణంగా నిలిచే సుధామూర్తిపై ‘ఓల్డ్‌ టౌన్‌ క్రిమినల్‌’ వెబ్‌ సిరీస్‌లో అవమానించే రీతిలో వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ దర్శకుడు అమర్‌, నిర్మాత మోహన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా జయరాజ్‌ మాట్లాడుతూ.. ఎంతోమందికి సాయం చేస్తున్న సుధామూర్తిలాంటి వాళ్లపై దుర్భాషలాడటం సరికాదన్నారు. అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఫిర్యాదుపై సుధామూర్తికి తాము సమాచారం ఇవ్వలేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని