ఆ 5రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయ్..!
భారత్లో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. గతంతో పోలిస్తే ఈ మహమ్మారి వ్యాప్తి కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ దిల్లీలాంటి చోట్ల మళ్లీ విజృంభిస్తోంది. అక్టోబర్ 29నుంచి నవంబర్ 29 వరకు దేశంలో.............
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. గతంతో పోలిస్తే ఈ మహమ్మారి వ్యాప్తి కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ దిల్లీలాంటి చోట్ల మళ్లీ విజృంభిస్తోంది. అక్టోబర్ 29నుంచి నవంబర్ 29 వరకు దేశంలో క్రియాశీల కేసులను ఓసారి పరిశీలిస్తే.. గతంలో కొవిడ్ విలయతాండవం చేసిన కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. మరోవైపు, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్లలో యాక్టివ్ కేసులు పెరిగినట్టు కేంద్రం విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి.
అక్టోబర్- నవంబర్లో హెచ్చుతగ్గులు ఇలా..
కరోనా వైరస్ మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత మొత్తంగా చూస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దిల్లీ, యూపీ, పశ్చిమబెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలే అత్యధిక కేసులు కలిగిన రాష్ట్రాల జాబితాలో టాప్-10లో ఉన్నాయి. అయితే, మరణాల విషయానికి వస్తే మాత్రం మహారాష్ట్రలో అత్యధికంగా 47వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. కర్ణాటకలో 11,765, తమిళనాడులో 11,703, దిల్లీ 9,066, పశ్చిమబెంగాల్ 8376 చొప్పున కొవిడ్తో ప్రాణ నష్టం జరిగింది. అయితే, ఈ నెల రోజుల కాలంలో మాత్రం సగటున మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు, కేరళలో యాక్టివ్ కేసుల్లో తగ్గుముఖం కనిపించడం విశేషం కాగా.. కొత్తగా కేసులు పెరగడం.. రికవరీ రేటు తగ్గుతుండటంతో దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు తగ్గుదల కనబడటంలేదు.
మరోవైపు, భారత్లో కొత్త కేసుల కన్నా రికవరీ అవుతున్నవారి సంఖ్యే అధికంగా ఉంది. ఆదివారం కొత్తగా మరో 38,772 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 45,333 మంది కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు భారీగానే ఉంది. దేశంలో ఇప్పటివరకు 88,47,600 మంది (93.81%) కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం కేవలం 4,46,952 (4.74%) క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి. దేశంలో కొవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని మరింతగా మెరుగు పరుచుకున్న భారత్.. రోజుకు దాదాపు 15 లక్షల శాంపిల్స్ పరీక్షించే దిశగా వెళ్తోంది. ఆదివారం 8.76లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14.03 కోట్ల శాంపిల్స్ను పరీక్షించినట్టు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్