భారీగా తగ్గిన కొవిడ్ మరణాలు, కేసులు!
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ రోజువారీ కేసులు, మరణాల సంఖ్య కాస్త తగ్గింది. నిత్యం దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తుండగా నిన్న ఆ సంఖ్య భారీగా తగ్గింది.
24గంటల్లో 70వేల కేసులు, 776 మరణాలు!
83శాతం దాటిన రికవరీ రేటు
దిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ రోజువారీ కేసులు, మరణాల సంఖ్య కాస్త తగ్గింది. నిత్యం దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తుండగా నిన్న ఆ సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో 776 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 96,318కు చేరింది. అయితే, రోజువారీ మరణాలు 800 దిగువన నమోదుకావడం రెండు నెలల తర్వాత ఇదే మొదటిసారి. ఆగస్టు 4 నుంచి ఇప్పటి వరకూ ఏ ఒక్కరోజు కూడా రోజువారీ మరణాల సంఖ్య ఎనిమిది వందల కంటే తక్కువ నమోదుకాలేదు. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 70,589 కేసులు నమోదయ్యాయి. 70వేల కేసులు నమోదుకావడం గత నెలరోజుల్లో ఇదే తొలిసారి. మంగళవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 61,45,291కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 51లక్షల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే మరో 84వేల మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 9లక్షల 47వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83శాతం దాటగా, మరణాల రేటు 1.57శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా నిన్న 11,42,811 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 7కోట్ల 31లక్షల టెస్టులు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అయితే, వారాంతంలో మాత్రం టెస్టుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఆదివారం కేవలం 7లక్షల పరీక్షలు నిర్వహించారు. అందుకే పాజిటివ్ కేసులు తక్కువగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే, మరణాల సంఖ్య తగ్గడం మాత్రం ఊరట కలిగించే విషయం. కేవలం ఒక్క మహారాష్ట్రలోనే నిత్యం దాదాపు 400ల మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. గడిచిన 24గంటల్లో అక్కడ 180 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు అక్కడ 35,751 మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడులో 9383 మంది ప్రాణాలు కోల్పోగా కర్ణాటకలో 8641 మంది కరోనా రోగులు చనిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?