ఒక్క ఆగస్టులోనే 20లక్షల కేసులు..!
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ప్రతినెల రెట్టింపుస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కేవలం ఆగస్టు నెలలోనే దేశవ్యాప్తంగా దాదాపు 20లక్షల కేసులు నమోదయ్యాయి.
భారత్లో 36లక్షల కేసుల్లో 28లక్షల మంది రికవరీ
24గంటల్లో 69వేల కేసులు, 819 మంది మృతి!
దిల్లీ: భారత్లో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ప్రతినెల రెట్టింపుస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కేవలం ఆగస్టు నెలలోనే దేశవ్యాప్తంగా దాదాపు 20లక్షల కేసులు నమోదయ్యాయి. ఒకే నెల వ్యవధిలో ఇన్ని కేసులు ప్రపంచంలో ఏ దేశంలోనూ నమోదుకాలేదు. అత్యధిక వైరస్ తీవ్రత ఉన్న అమెరికాలోనూ జులై నెలలో అత్యధికంగా 19లక్షల 4వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. భారత్లో ఆగస్టు నెలలోనే రికార్డుస్థాయిలో 19లక్షల 50వేల కేసులు బయటపడ్డాయి. మరణాలు మాత్రం అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆగస్టు నెలలో అమెరికాలో 31వేల కొవిడ్ మరణాలు నమోదుకాగా బ్రెజిల్లో దాదాపు 30వేల మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్లో ఈ సంఖ్య దాదాపు 28వేలుగా ఉంది.
భారత్లో నిత్యం 70వేలకు పైగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24గంటల్లో మరో 69,921 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత నాలుగురోజులతో పోల్చితే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దీంతో మంగళవారంనాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 36లక్షల 91వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 28లక్షల 39వేల మంది కోలుకోగా మరో 7లక్షల 85వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న మరో 65వేల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76శాతం దాటింది. గడిచిన ఆరు రోజుల తర్వాత మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 819 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు . దీంతో మంగళవారం నాటికి దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య 65,288కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్లో కరోనా మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది.
ఇవీ చదవండి..
తుది ఆమోదానికి చేరువలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్
ఆరువారాల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం