కరోనా: 24గంటల్లో 904 మంది మృతి!

దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దాదాపు 800 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 904 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 24గంటల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 40,699కు చేరింది.

Published : 06 Aug 2020 10:16 IST

దేశంలో 40వేలు దాటిన కరోనా మరణాలు
నెల రోజుల్లోనే 20వేల మంది మృతి
24గంటల్లో 56,282 కేసులు, 46వేల మంది రికవరీ

దిల్లీ: దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దాదాపు 800 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 904 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 24గంటల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 40,699కు చేరింది. గడిచిన నెలరోజుల్లో దేశవ్యాప్తంగా 20వేల కరోనా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇక పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా మరో 56,282 కేసులు బయటపడ్డాయి. రోజువారీ అత్యధిక కేసుల్లో ఈ సంఖ్యది రెండోసారి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ సోకిన వారిసంఖ్య 19,64,536కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 13లక్షల 28వేల మంది కోలుకోగా మరో 5లక్షల 95వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 67శాతం ఉండగా, మరణాల రేటు 2.09శాతంగా ఉంది.

ఇదిలా ఉంటే, ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. మరణాల్లో మాత్రం ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది.

ఇవీ చదవండి..
చిన్న తుంపర్లతోనే పెద్ద ముప్పు..!
90శాతం కరోనా విజేతల్లో ఊపిరితిత్తుల సమస్యలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని