కరోనా టీకా: ఏయే దేశాలు అనుమతి ఇచ్చాయంటే..!
కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఆశతో ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఆశతో ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. తుది దశ ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలను ఇచ్చినట్లు వ్యాక్సిన్ తయారీ సంస్థలు వెల్లడించడంతో ప్రపంచ దేశాలు కాస్త ఊపిరిపీల్చుకున్నాయి. ఫైజర్, మోడెర్నాలతో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్ కూడా సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు ప్రకటించాయి. వివిధ దేశాల నియంత్రణ సంస్థలు అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ పంపిణీకి అనుమతులు ఇస్తున్నాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించిన కొన్ని దేశాల వివరాలు..
బ్రిటన్: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి అతలాకుతలమైన బ్రిటన్లో ఫైజర్ వ్యాక్సిన్కు డిసెంబర్ 3వ తేదీనే అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 8 నుంచి వ్యాక్సిన్ పంపిణీని మొదలుపెట్టిన బ్రిటన్.. తొలుత 8లక్షల డోసులను అందించనున్నట్లు పేర్కొంది. ఈ సమయంలో తాజాగా కొత్తరకం వైరస్ బయటపడడంతో మరోసారి వ్యాక్సిన్ పనితీరుపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే, కొత్తరకం వైరస్పైనా తమ టీకా సమర్థవంతంగానే పనిచేస్తుందని ఫైజర్ సంస్థ ప్రాథమికంగా వెల్లడించింది.
అమెరికా: కరోనా విజృంభణకు వణికిపోతోన్న అమెరికాలో ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలో అత్యవసర వినియోగం కింద తొలి అనుమతి పొందిన సంస్థగా ఫైజర్ నిలువగా, అనంతరం మోడెర్నాకు అనుమతి లభించింది. అయితే, మోడెర్నాకు అనుమతిచ్చిన తొలి దేశం మాత్రం అమెరికానే. దీంతో ఇప్పటికే అమెరికాలో దాదాపు 5లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు సమాచారం. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కూడా వ్యాక్సిన్ను బహిరంగంగానే తీసుకున్న విషయం తెలిసిందే.
కెనడా: ఫైజర్ వ్యాక్సిన్కు అటు కెనడా కూడా అత్యవసర వినియోగానికి డిసెంబర్ 9న అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 14న తొలి డోసు పంపిణీ చేసింది. ఈ నెల చివరినాటికి దాదాపు రెండున్నర లక్షల మందికి వ్యాక్సిన్ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇజ్రాయిల్: కరోనా వ్యాక్సిన్ను అందించడంలో ఇజ్రాయిల్ కూడా ముందుంది. ఈ వారమే అక్కడ వ్యాక్సిన్ పంపిణీని చేపట్టారు. జనవరి నాటికి దాదాపు 20లక్షల మందికి వ్యాక్సిన్ అందించడాన్ని అక్కడి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మెక్సికో: ఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్కు మెక్సికో కూడా అనుమతిచ్చింది. ఈ రోజే అక్కడ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించారు. తొలుత రెండు రాష్ట్రాల్లో దాదాపు లక్షా 25వేల మందికి వ్యాక్సిన్ అందిస్తామని మెక్సికో ప్రభుత్వం పేర్కొంది. కేవలం ఫైజర్ నుంచే దాదాపు 3కోట్ల డోసులను మెక్సికో ఆర్డర్ చేసుకుంది.
బహ్రెయిన్: ఫైజర్ టీకాకు అనుమతిచ్చిన రెండో దేశంగా బహ్రెయిన్ నిలిచింది. డిసెంబర్ నాలుగో తేదీనే వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. కరోనా టీకాను తీసుకోదలచుకున్న వారు ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాలని అక్కడి పౌరులకు సూచించింది. అనంతరం చైనాకు చెందిన సినోఫార్మ్ తయారు చేసిన వ్యాక్సిన్కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడ రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.
రష్యా: కరోనా వ్యాక్సిన్ను తయారుచేసిన తొలి దేశంగా రష్యా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అక్కడి ఆర్డీఐఎఫ్ తయారుచేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ దాదాపు 94శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తుది దశ ప్రయోగాల విశ్లేషణ అనంతరం వెల్లడించింది. అయితే, ప్రయోగ ఫలితాలు వెల్లడికాకముందే ఆగస్టులోనే వ్యాక్సిన్ పంపిణీ చేపట్టింది. ఇప్పటికే దాదాపు లక్ష మందికి టీకా అందించింది. ఈ నెల చివరినాటికి 20లక్షల మందికి టీకా ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. కానీ, రష్యాలో వ్యాక్సిన్ పంపిణీపై మిశ్రమ స్పందన వస్తోన్నట్లు తెలుస్తోంది.
చైనా: కరోనా వైరస్కు కారణమైన చైనా.. వ్యాక్సిన్ తయారీలోనూ ముందుంది. జులై నుంచే అక్కడ అత్యవసర వినియోగం కింద భారీ సంఖ్యలో వ్యాక్సిన్ను అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం అక్కడ సినోఫార్మ్ తయారుచేసిన రెండు వ్యాక్సిన్లకు, మరో సంస్థ సినోవాక్ బయోటెక్ వ్యాక్సిన్తో పాటు క్యాన్సినో బయోలాజిక్స్ తయారు చేసిన వ్యాక్సిన్లు అనుమతి పొందాయి. దీంతో చైనాలో నాలుగు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. జనవరి చివరి నాటికి అక్కడ దాదాపు 5కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలని జిన్పింగ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా మీడియా తెలిపింది.
స్విట్జెర్లాండ్: రెండు నెలల సుదీర్ఘ పరిశీలన తర్వాత ఫైజర్ టీకాకు స్టిట్జెర్లాండ్ కూడా అనుమతి ఇచ్చింది.
ఈయూ: ఇక కరోనా ధాటికి వణికిపోతోన్న యూరోపియన్ యూనియన్లో త్వరలోనే వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు కానుంది. తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(EMA)అనుమతి ఇచ్చింది. దీంతో ఈయూలోని 27 సభ్యదేశాల్లో ఒకేసారి డిసెంబర్ 27వ తేదీన వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఇదిలాఉంటే, భారత్లోనూ మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అనుమతి పొందిన ఆరు నెలల్లోనే దాదాపు 30కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇవీ చదవండి..
కరోనా.. కొత్త వేషం..!
యూకే రిటర్న్స్: భారత్లో వారందరినీ ట్రాక్ చేస్తాం..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్