కొవిడ్ రికవరీల్లో అగ్రస్థానంలో భారత్!
కరోనా నుంచి కోలుకుంటున్న వారిలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
అమెరికా, యూరప్లలో అతి తక్కువ రికవరీ
దిల్లీ: కరోనా నుంచి కోలుకుంటున్న వారిలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన రెండు నెలల్లో క్రియాశీల కేసుల సంఖ్య మూడు రెట్లు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 53,285 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 75లక్షలకు చేరింది.
భారత్, బ్రెజిల్లోనే అత్యధిక రికవరీ..
భారత్లో ఇప్పటివరకు 82లక్షల పాజిటివ్ కేసులు బయటపడగా వీరిలో 75లక్షల 44వేల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 91.68శాతంగా ఉంది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న అమెరికాలో మొత్తం 92లక్షల కేసులు నమోదుకాగా వీరిలో కేవలం 36లక్షల మంది మాత్రమే కోలుకున్నారు. ఇక్కడ కొవిడ్ కారణంగా మరణిస్తున్న వారిసంఖ్య అధికంగా ఉంది. యూరప్ దేశాల్లోనూ వైరస్ బారినుంచి కోలుకుంటున్న వారిసంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఫ్రాన్స్లో 14లక్షల కేసులు బయటపడగా వీరిలో కేవలం లక్షా 23వేల మంది మాత్రమే కోలుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక స్పెయిన్లోనూ 12లక్షల కొవిడ్ రోగుల్లో లక్షా 50వేల మంది రికవరీ అయ్యారు. యూకేలోనూ పరిస్థితి అలాగే ఉంది. ఒక్క జర్మనీలో మాత్రం వైరస్ నుంచి కోలుకునే వారిసంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే విషయం. ఇక మెక్సికోతోపాటు దక్షిణ అమెరికా దేశాలైన బ్రెజిల్, అర్జెంటీనా, పెరూ, చిలీ దేశాల్లో రికవరీ సంఖ్య మెరుగుగానే ఉంది. బ్రెజిల్లో ఇప్పటివరకు మొత్తం 55లక్షల కేసులు నమోదుకాగా వీరిలో 50లక్షల మంది కోలుకున్నారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 4కోట్ల 66లక్షల మందిలో వైరస్ బయటపడగా వీరిలో ఇప్పటికే 3కోట్ల 11లక్షల మంది కోలుకున్నారు. ప్రపంచ రికవరీల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
భారత్లో మూడు రెట్లు తగ్గిన క్రియాశీల కేసులు..
ప్రస్తుతం భారత్లో 5లక్షల 61వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలకు దిగువగా ఉండటం వరుసగా ఇది నాలుగో రోజు. కాగా, ఇది మొత్తం కేసుల్లో 6.83శాతం మాత్రమే. ఇక సెప్టెంబర్ 3న 21శాతంగా ఉన్న క్రియాశీల కేసులు ప్రస్తుతం ఆరుశాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ బయటపడిన రోజు నుంచే నిర్ధారణ పరీక్షలను భారీ స్థాయిలో చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. దీంతో ఇప్పటివరకు 11కోట్ల టెస్టులను పూర్తిచేశామని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2037 కొవిడ్ నిర్ధారణ కేంద్రాలను నిర్వహిస్తున్నామని..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే వైరస్ కట్టడి సాధ్యమవుతోందని వెల్లడించింది. దేశంలో అన్లాక్ ప్రక్రియ మొదలైన జూన్ నెల నుంచి దేశంలో కరోనా రికవరీ తీరు ఇలా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
బెంగళూరు కేఫ్లో బాంబు పేలుడు నిందితుల ఆచూకీ చెప్పిన వారికి ఎన్ఐఏ రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. -
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
Anand Mahindra - Elon Musk: తయారీ రంగంలో హీరోల జీవితాలను వెండి తెరపైకి తీసుకురావాలని ఎలాన్ మస్క్ ఇచ్చిన పిలుపును ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. -
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా 79 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్