రాయ్‌గఢ్‌ ఘటనలో మరొకరి మృతి

రాయ్‌గఢ్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మరో 18 మంది..

Published : 25 Aug 2020 10:59 IST

కొనసాగుతున్న సహాయక చర్యలు

ముంబయి: రాయ్‌గఢ్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మరో 18 మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా కాజల్‌పురా ప్రాంతం మహద్‌ పట్టణంలో సోమవారం సాయంత్రం ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దాదాపు 75 మంది భవనం శిథిలాల కింద చిక్కుకుపోయారు. అప్పటి నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడాయి. కూలిన పదేళ్లనాటి ఆ భవనంలో 45 ఫ్లాట్లు ఉన్నట్లు నివాసితులు తెలిపారు. ‘సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందారు. ఇంకో 18 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది’ అని రాయ్‌గఢ్‌ జిల్లా కలెక్టర్‌ నిధి చౌదరి పేర్కొన్నారు. మహారాష్ట్ర మంత్రులు అదితి ఠాక్రే, ఏక్‌నాథ్‌ శిండే ఘటనా స్థలాన్ని సందర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని