రెస్టారెంట్‌ కూలి 29 మంది మృతి

చైనాలో ఓ రెస్టారెంట్‌ కూలిన ఘటనలో 29 మంది మృత్యువాతపడ్డారు. శాంషీ ప్రావిన్సులోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు 57 మందిని శిథిలాల నుంచి వెలికితీశారు. ఓ పుట్టినరోజు వేడుక జరుగుతుండగా.............

Published : 30 Aug 2020 10:59 IST

బీజింగ్‌: చైనాలో ఓ రెస్టారెంట్‌ కూలిన ఘటనలో 29 మంది మృత్యువాతపడ్డారు. శాంషీ ప్రావిన్సులోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు 57 మందిని శిథిలాల నుంచి వెలికితీశారు. ఓ పుట్టినరోజు వేడుక జరుగుతుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. మరో 21 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని