దిల్లీ ఉపముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌

మ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా సోమవారం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా ఆయన కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వెల్లడైంది. దీంతో ఆయన తనంతట తానే ఐసోలేషన్‌కు వెళ్లారు.

Published : 14 Sep 2020 20:53 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా సోమవారం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా ఆయన కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వెల్లడైంది. దీంతో ఆయన తనంతట తానే ఐసోలేషన్‌కు వెళ్లారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.

‘ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నా. ఎలాంటి జ్వరం ఇతర లక్షణాలూ లేవు. మీ అందరి ఆశీర్వాదాలతో త్వరలోనే కోలుకుని మళ్లీ విధుల్లోకి వస్తా’ అంటూ వెల్లడించారు. కాగా దిల్లీలో ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. వారిలో 1.88వేల మంది తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం 28వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు దిల్లీ వైద్యశాఖ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని