నెలలో 2300 మరణాలు.. దిల్లీకి ఏమైంది?
దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. నవంబర్ మాసం పూర్తికాకముందే ఒక్క నెలలో దిల్లీలో 2వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. అక్టోబర్ 28 నుంచి ఇప్పటివరకు 2364 మంది కొవిడ్తో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు...........
దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. నవంబర్ మాసం పూర్తికాకముందే దిల్లీలో 2వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. అక్టోబర్ 28 నుంచి ఇప్పటివరకు 2364 మంది కొవిడ్తో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. చలి కాలానికి తోడు పండుగ సీజన్ తోడవ్వడంతో అక్టోబర్ చివరి వారం నుంచి దిల్లీలో కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఒక్క రోజే రాజధానిలో 99 మరణాలు నమోదు కావడంతో మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య 8720కి చేరింది.
దిల్లీలో కేసులు, మరణాలు ఇలా..
దిల్లీ నగరంలో నవంబర్ 19న 98 మరణాలు నమోదు కాగా.. 20న 118, 21న 111, 22న, 23 తేదీల్లో 121 చొప్పున, నవంబర్ 24న 109చొప్పున మరణాలు నమోదైనట్టు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. నవంబర్ 18న అత్యధికంగా 131 మరణాలు నమోదు కాగా.. నవంబర్ 11న అత్యధికంగా 8593 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక గత వారం నుంచి నమోదైన కేసులను పరిశీలిస్తే.. గురువారం 7546 కొత్త కేసులు నమోదు కాగా.. శుక్రవారం 6608, శనివారం 5879, ఆదివారం 6746, సోమవారం 4454, మంగళవారం 6224, బుధవారం 5246 చొప్పున కేసులు నమోదయ్యాయి. దిల్లీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 5,45,787కు చేరుకుంది. వీరిలో 8720మంది ప్రాణాలు కోల్పోగా.. 4,98,780 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 38,287 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నిపుణులేమంటున్నారు?
కరోనా సోకిన తర్వాత ఆస్పత్రుల్లో ఆలస్యంగా చేరడం వల్ల రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు దిల్లీలో ఐసీయూ పడకల కొరత, ప్రతికూల వాతావరణం, కాలుష్యం పెరగడం వల్ల దిల్లీలో మరణాలు సంఖ్య అధికంగా ఉంటుందోని చెబుతున్నారు. రాజధాని నగగరంలో వైరస్ సంక్రమణ పెరుగుతండటంతో మరణాలను ఆడిట్చేయాలని, కొవిడ్ మరణాలను తగ్గించేందుకు తగిన సూచనలు చేయాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్ బుదవారం నిపుణులకు విజ్ఞప్తి చేశారు.
మరణాలపై హైకోర్టు ఆందోళన
దేశ రాజధానిలో నవంబర్ నెలలో 2వేలకు పైగా మరణాలు నమోదవడంపై దిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచిందని ఆక్షేపించింది. దిల్లీలో కొవిడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారి నుంచి వసూలు చేస్తున్న డబ్బుతో ఏం చేస్తున్నారని అడిగింది. ఆ డబ్బును మంచి కారణం కోసం వినియోగించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి జరిమానా వసూళ్లకు నగదు చెల్లింపులు చేయొద్దని, దీని కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ ఏర్పాటు చేసి దాని ద్వారా నగదు రహిత చెల్లింపులను ఆన్లైన్ ద్వారా స్వీకరించాలని దిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో