‘‘80 ఏళ్లలో మొదటి సారి.... 

కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా ఎర్రకోట మైదానంలో ఈసారి రామ్‌లీలా వేడుకలను నిర్వహించటం లేదని లవ్‌కుశ్‌ రామ్‌లీలా కమిటీ పేర్కొంది. ఏఎస్‌ఐ(ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) కార్యక్రమానికి ఇంకా అనుమతి ఇవ్వలేదని

Published : 13 Oct 2020 02:06 IST

 


దిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా ఎర్రకోట మైదానంలో ఈసారి రామ్‌లీలా వేడుకలను నిర్వహించటం లేదని లవ్‌కుశ్‌ రామ్‌లీలా కమిటీ పేర్కొంది. ఏఎస్‌ఐ(ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) కార్యక్రమానికి ఇంకా అనుమతి ఇవ్వలేదని వివరించింది. సాధారణంగా ఏటా ఇక్కడ జరిగే వేడుకలలో దేశ ప్రధాని, రాష్ట్రపతి పాల్గొంటుంటారు. గత 80 ఏళ్లలో ఇక్కడ వేడుకలు లేకపోవటం ఇదే మొదటిసారి. రామ్‌లీలా, దుర్గాపూజ ఉత్సవాలను నిర్వహించుకోవచ్చని దిల్లీ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కానీ తాము నిర్దేశించిన కొవిడ్‌ నిబంధనలు పాటించడం  తప్పనిసరి అని పేర్కొంది. ఈ విషయంపై లవ్‌కుశ్‌ రామ్‌లీలా కమిటీ ఓ మీడియా సంస్థతో మాట్లాడింది.

‘‘మేము రామ్‌లీలా  నిర్వహించాలని మొదట అనుకున్నాం. కానీ ఎర్రకోట మైదానం ఏఎస్‌ఐ పరిధిలోకి వస్తుంది. వారి నుంచి ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. వేడుకలకు నిర్వహణకు చాలా సమయం ఉంది. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం నిర్దేశించిన నియమాల అనుసరణ ఆచరణాత్మకంగా సాధ్యం కాదు. ప్రభుత్వమూ అయిష్టంగానే ఉన్నట్లుంది. 80 ఏళ్లుగా ఎర్రకోట మైదానంలో రామ్‌లీలా నిర్వహణ జరుగుతోంది. కానీ ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. దేశంలో మా కమిటీ నిర్వహించే రామ్‌లీలా వేడుకలే పెద్దవి. 600 మందికి పైగా కళాకారులు ఇందులో పాల్గొంటారు. అందులో కొంతమంది ముంబయి నుంచీ వస్తారు. రాబోయే పదిరోజులలో ఏదైనా అవకాశం వస్తే ఒక్కరోజూ వేడుకను నిర్వహిస్తాం. అయితే ప్రజల ఆరోగ్య పరమైన భద్రతా ముఖ్యమే. ఏ మతపరమైన సంఘటన మహమ్మారి సంక్రమణకు కారణం కాకుడదు’’అని లవ్‌కుశ్‌ రామ్‌లీలా కమిటీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని