బెర్నీ.. ముందే చెప్పేశాడు ఇవన్నీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల తీరుతెన్నులు ఎలా ఉంటాయో కంటికి కట్టినట్టు రెండు వారాల క్రితమే ఒకరు చెప్పారు.
అమెరికా ఎన్నికల్లో ఏం జరగనుందో 2 వారాల ముందే వెల్లడి
ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్య ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని గురించి ఓ జ్యోతిష్కుడు ఊహించి చెప్పిన దాన్ని.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశారు. అయితే ఆయన చెప్పినదానికి, జరిగిన దానికి కాస్త తేడా ఉన్న మాట నిజం. కాగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తీరుతెన్నులు ఎలా ఉంటాయో కంటికి కట్టినట్టు రెండు వారాల క్రితమే మరొకరు చెప్పారు. అది మరో జ్యోతిష్కుడో మరెవరో కాదు.. డెమొక్రాటిక్ సెనేటర్ బెర్నీ సాండర్స్. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయని 79 ఏళ్ల బెర్నీని ఓ ముఖాముఖిలో వ్యాఖ్యాత అడిగారు. ఇందుకు పోస్టల్ ఓట్లు భారీ సంఖ్యలో పోలవుతాయని.. దీని వల్ల ఎన్నికల ప్రక్రియ, ఫలితాల వెల్లడి కూడా ఆలస్యం కానున్నాయని ఆయన జవాబిచ్చారు.
అంతేకాకుండా ‘‘పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్నిన్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొన్ని కారణాల వల్ల ఆలస్యమౌతుంది. ఇందుకు లక్షల సంఖ్యలో వచ్చిపడే పోస్టల్ బ్యాలెట్లు కారణం కావచ్చు. ఇక ఎన్నికల రోజు రాత్రి సుమారు 10 గంటలకు ట్రంప్ కొన్ని రాష్ట్రాల్లో గెలుస్తాడు... ఇంకా పూర్తి ఫలితాలు వెలువడకుండానే ‘తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు’ అంటూ ప్రకటనలు చేస్తాడు. అతను గెలువని కొన్ని కీలక రాష్ట్రాల్లో మోసం జరిగిందని ఆరోపిస్తాడు. న్యాయవ్యవస్థ సరిగా పనిచేయాలని కోరుతాడు. ఓటింగ్ ప్రక్రియను వెంటనే ఆపాలని.. అందుకు గాను తాను సుప్రీం కోర్టుకు కూడా వెళతానంటాడు. ఆ తర్వాతి రోజు లేదా ఆపై రోజు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తవుతుంది. బైడెన్ గెలిచినట్టు వెల్లడౌతుంది. అప్పుడు కూడా.. పోస్టల్ బ్యాలెట్ విధానం లోపభూయిష్టమైనదనే తన వాదన రుజువైందని ట్రంప్ మళ్లీ ప్రకటిస్తాడు.’’ అని వెల్లడించారు. కాగా ఆయన చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరగటం అందరికీ తెలిసిందే.
కాగా ఈ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించిన ఈ వీడియో చూసి.. బెర్నీ సాండర్స్ జోస్యం నిజమో కాదో మీరే నిర్ణయించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు