విమానంలో భోజనం..అరగంటలో టికెట్లు హుష్!
కరోనా మహమ్మారి సృష్టించిన అలజడితో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైనాయి. ఇప్పటికే పలు సంస్థలు కార్యకలాపాలను మూసివేయగా.. మరికొన్ని ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నాయి. కరోనా ప్రభావం విమానయానంపై తీవ్రప్రభావం చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశీరాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి....
సింగపూర్: కరోనా మహమ్మారి సృష్టించిన అలజడితో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైనాయి. ఇప్పటికే పలు సంస్థలు కార్యకలాపాలను మూసివేయగా.. మరికొన్ని ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నాయి. కరోనా ప్రభావం విమానయానంపై తీవ్రప్రభావం చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశీరాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ మధ్యనే నిబంధనల నడుమ అడపాదడపా సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సింగపూర్ ఎయిర్లైన్స్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.
విమానాన్నే ఓ హొటల్గా మార్చేసి అక్కడికొచ్చిన వారికి భోజనం పెట్టాలని నిర్ణయించింది. నాణ్యతను బట్టి కస్టమర్ల నుంచి దాదాపు 642 సింగపూర్ డాలర్ల వరకు వసూలు చేయనుంది. విమానాన్ని ఓ ఎయిర్పోర్టులో పార్కు చేసి భోజనాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. దీనికోసం దాదాపు 900 మంది కూర్చునే సామర్థ్యమున్న A380s విమానాన్ని సింగపూర్ ఎయిర్లైన్స్ ఎంచుకుంది. స్థానిక ఛాంగి విమానాశ్రయంలో పార్కు చేసి ఈ నెల 24, 25 తేదీల్లో భోజనాల కోసం టికెట్ బుకింగ్స్ను సోమవారం ప్రారంభించింది. వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటీపడ్డారు. కేవలం అరగంటలోపే టికెట్లన్నీ అమ్ముడు పోయాయి. దీంతో ఆశ్చర్యపోవడం నిర్వాహకుల వంతైంది. అయితే కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించేందుకు వీలుగా కేవలం సగం టికెట్లను మాత్రమే విక్రయించారు.
భారీగా స్పందన వస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు దీనిని కొనసాగించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ నిర్ణయించింది. మరోవైపు సరదాగా విమాన ప్రయాణం చేయాలనుకున్న వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొచ్చేందుకు ఈ సంస్థ ప్రయత్నాలు చేసింది. ప్రయాణికులను ఎక్కించుకొని ఆలా కాసేపు చక్కర్లు కొట్టి తిరిగి అదే విమానాశ్రయంలో దింపేలా కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో తన ప్రయత్నాలను విరమించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్