మరో నాలుగేళ్లు మనమే: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార రిపబ్లిక్, ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కరోనా నుంచి కోలుకున్న తర్వాత తన ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శనివారం మిచిగాన్లో ఏర్పాటు చేసి ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో....
మిచిగాన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార రిపబ్లిక్, ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కరోనా నుంచి కోలుకున్న తర్వాత తన ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో శనివారం మిచిగాన్లో ఏర్పాటు చేసి ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో లాగానే ప్రజలకు ఎల్లప్పుడూ రిపబ్లికన్ పార్టీనే గెలిపించాలని ఆకాంక్షించారు.
‘‘తాజా ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ ఎన్నికల్లో విజయం మనదేనని బలంగా నమ్ముతున్నాను. మరో నాలుగేళ్లు రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉండటం ఖాయం. భవిష్యత్లోనూ ప్రజలు ఇదే పంథాను కొనసాగించాలి. రిపబ్లికన్ పార్టీకి విజయం అందించాలి’’ అని ట్రంప్ అన్నారు. దీంతో అక్కడి వారంతా ‘‘మరో నాలుగేళ్లు.. మరో నాలుగేళ్లు’’ అంటూ నినాదాలు చేశారు. తాజా ఎన్నికలలు అమెరికా చరిత్రలోనే అంత్యంత కీలకమైనవని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ప్రజలకు అధికారాలిచ్చే దిశగా పని చేస్తున్నామన్నారు. అమెరికా ప్రజల అండదండలతో ఇప్పటి వరకు పాలన సజావుగా సాగిందని, రిపబ్లికన్ పార్టీకి మరోసారి అధికారమిచ్చి మున్ముందు కూడా దేశానికి మరింత సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ట్రంప్ కోరారు.
మరోవైపు అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, బైడెన్ మధ్య అక్టోబర్ 15న జరగాల్సిన రెండో ముఖాముఖి రద్దయిన విషయం తెలిసిందే. ట్రంప్నకు కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం ఆయన శ్వేతసౌధానికే పరిమితమైపోయారు. ఈ నేపథ్యంలో డిబేట్ కమిషన్ ముఖాముఖిని వర్చువల్గా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ట్రంప్ దీనిని వ్యతిరేకించడంతో ఆ డిబేట్ను రద్దు చేశారు. తాజాగా వచ్చే వారంలో బెల్మాంట్ యూనివర్సిటీలో ఈ ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!