యాంటీబాడీ టెస్టులో మరో ప్రత్యామ్నాయం!
రక్తానికి ప్రత్యామ్నాయంగా కేవలం ఎండిన రక్తపు శాంపిళ్ల(డ్రైడ్ బ్లడ్ స్పాట్-డీబీఎస్)తో కచ్చితమైన యాంటీబాడీ టెస్టులు సాధ్యమని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఎండిన రక్తపు శాంపిళ్లతో టెస్టు మరింత సులభం
ఇంటర్నెట్ డెస్క్: వైరస్బారిన పడిన వ్యక్తులను లేదా ఇదివరకే ఏదైనా వైరస్ సోకినట్లు తెలుసుకునేందుకు యాంటీబాడీ టెస్టులు ఎంతో కీలకం. ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో ఈ టెస్టులకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అయితే, ప్రస్తుతం అనుమానిత వ్యక్తి నుంచి రక్తాన్ని లేదా ప్లాస్మా సేకరించి యాంటీబాడీ టెస్టును నిర్వహిస్తున్నారు. వీటిని సేకరించడానికి ప్రత్యేక శిక్షణ కలిగిన మెడికల్ సిబ్బంది కావాల్సి వస్తోంది. ఒక్కోసారి కరోనా సోకిన వ్యక్తుల శరీరం నుంచి రక్తం సేకరించడం మరింత క్లిష్టంగా మారుతోంది. ఇలాంటి సమయంలో భారీ సంఖ్యలో యాంటీబాడీ టెస్టులు చేయడం పెద్ద సవాల్గా మారింది. వీటికి ప్రత్యామ్నాయంగా నూతన విధానంతో శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. కేవలం ఎండిన రక్తపు శాంపిళ్ల(డ్రైడ్ బ్లడ్ స్పాట్-డీబీఎస్)తో కచ్చితమైన యాంటీబాడీ టెస్టులు సాధ్యమని ప్రకటించారు. ఈ పద్ధతిలో శాంపిల్ను సులభంగా సేకరించడమే కాకుండా తక్కువ ఖర్చుతో రోగి స్వయంగా ఇంటివద్దే శాంపిల్ను సేకరించవచ్చని పేర్కొన్నారు. అనంతరం వీటిని ఫోరెన్సిక్ గ్రేడ్ కార్డు ద్వారా ల్యాబ్కు పంపించే వీలుంటుందని లండన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
వీటి పనితీరులో భాగంగా వాలంటీర్ల నుంచి సేకరించిన రక్తంతోపాటు డీబీఎస్ శాంపిళ్లను లండన్లోని బర్మింగ్హమ్కు చెందిన శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ వాలంటీర్లలో అప్పటికే కొందరు వైరస్ బారినపడిన వారు కాగా మరికొందరికి నెగెటివ్ వచ్చిన వారున్నారు. ఇంకొందరికి మాత్రం ఎలాంటి పరీక్షలు జరపలేదు. వీరి నుంచి రెండురకాల శాంపిళ్లను సేకరించి కరోనా వైరస్ యాంటీబాడీ టెస్టు నిర్వహించారు. అనంతరం రెండు శాంపిళ్ల ఫలితాలు ఒకేవిధంగా వచ్చినట్లు గుర్తించారు. డీబీఎస్ శాంపిళ్లలో 98నుంచి 100శాతం యాంటీబాడీలను గుర్తిస్తున్నాయని తేల్చారు. అంతేకాకుండా ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా నిర్ధారణ అయిన రోగుల్లోనూ 100శాతం యాంటీబాడీలను ఈ పద్ధతిలో గుర్తించగలుగుతున్నట్లు పరిశోధకులు తేల్చారు.
ఎండిన రక్తపు శాంపిళ్ల (డ్రైడ్ బ్లడ్ స్పాట్-డీబీఎస్) ద్వారా యాంటీబాడీ టెస్టులు చేయడం ఇప్పటికే ఉన్న పద్ధతికి ప్రత్యామ్నాయంతో పాటు శాంపిళ్లను తీసుకోవడానికి ప్రత్యేక శిక్షకులు కూడా అవసరం లేదని బర్మింగ్హమ్ యూనివర్సిటీ నిపుణులు డాక్టర్ మాథ్యూ ఓషియా స్పష్టంచేశారు. వీటితోపాటు తక్కువ ఖర్చుతో చేయడం మధ్య ఆదాయ దేశాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ అడమ్ కన్నిన్ఘమ్ అభిప్రాయపడ్డారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న లండన్లో భారీ సంఖ్యలో యాంటీబాడీ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రక్తాన్ని సేకరించకుండా ప్రత్యామ్నాయంగా యాంటీబాడీ టెస్టులు చేయడం కోసం పలు పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీటిలోభాగంగా ఈ టెస్టుల కోసం డీబీఎస్ పద్ధతి ఎంతో మెరుగైందని బర్మింగ్హమ్ యూనివర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సమయంలోనే కాకుండా ఇతర వైరస్ల విషయంలోనూ యాంటీబాడీలను గుర్తించేందుకు ఈ డీబీఎస్ పద్ధతిపై పరిశోధనలు జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!