11 రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు ఇలా..!
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, 59 స్థానాల్లో దాదాపు 40చోట్ల భాజపా విజయం సాధించింది.
దిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే చాలా ఫలితాలు వెల్లడికాగా మరికొన్నిచోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, 59 స్థానాల్లో దాదాపు 40చోట్ల భాజపా విజయం సాధించింది. కాంగ్రెస్ మాత్రం కేవలం పన్నెండు స్థానాల్లోనే ఆధిక్యత కనబరిచింది. మరో ఏడు స్థానాల్లో ఇతర పార్టీలు/ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో 17చోట్ల భాజపా విజయం సాధించగా మరో రెండు స్థానాల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక గుజరాత్లోనూ జరిగిన 8 స్థానాలను భాజపా క్లీన్స్వీప్ చేసింది. మరో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోనూ ఆరు స్థానాల్లో భాజపా విజయ దుందుభి మోగించింది. మరో స్థానంలో సమాజ్వాది పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఉన్నావ్ జిల్లాలోని బంగేర్మౌ నియోజకవర్గంలోనూ భాజపా అత్యధిక మెజారిటీ సాధించింది. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న భాజపా నేత కుల్దీప్ సింగ్ అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని మళ్లీ భాజపానే కైవసం చేసుకుంది.
11 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి..
* ఛత్తీస్గఢ్లో ఒకస్థానానికి ఉపఎన్నిక జరగ్గా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్కు 56శాతం ఓట్లు పోలవ్వగా రెండోస్థానంలో ఉన్న భాజపాకు 36శాతం ఓట్లు పోలయ్యాయి.
* గుజరాత్లో ఎనిమిది స్థానాల్లో భాజపా అన్నిచోట్లా విజయం సాధించింది. ఇక్కడ కూడా రెండు పార్టీల మధ్య దాదాపు 20శాతం ఓట్ల తేడా ఉంది. భాజపాకు 55శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కు 34శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
* హరియాణాలో ఒక స్థానానికి ఎన్నిక జరగ్గా .. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. భాజపా అభ్యర్థిపై దాదాపు పదివేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.
* ఝార్ఖండ్లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఒక స్థానంలో, జేఎంఎం మరోస్థానంలో గెలుపొందాయి.
* కర్ణాటకలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటిలో భాజపా విజయం సాధించింది.
* మధ్యప్రదేశ్లో 28స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో భాజపా ఇప్పటికే 17చోట్ల విజయం సాధించగా మరో రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. మరో ఏడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. రెండు స్థానాల్లో ముందంజలో ఉంది.
* మణిపూర్లో ఐదు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇప్పటికే నాలుగు స్థానాల్లో భాజపా, మరోస్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.
* నాగాలాండ్లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి, మరోస్థానంలో ఎన్డీపీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్కశాతం ఓట్లు కూడా సాధించలేదు. ఇక భాజపాకు మాత్రం 14శాతం ఓట్లు వచ్చినప్పటకీ పోటీ ఇవ్వలేకపోయింది.
* ఒడిశాలో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. ఇక్కడ రెండు స్థానాల్లోనూ బిజూ జనతాదళ్(బీజేడీ) విజయం సాధించింది.
* తెలంగాణలో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ భాజపా విజయం సాధించింది. అయితే, భాజపా, తెరాస పార్టీల మధ్య చివరివరకూ హోరాహోరీ పోరు కొనసాగింది. చివరకు వెయ్యి ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థి విజయం సాధించారు.
*ఉత్తర్ప్రదేశ్లో ఏడు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఆరు స్థానాల్లో భాజపా, ఒకచోట ఎస్పీ విజయం సాధించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి