ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను కూడా అమరుడయ్యారు.

Published : 12 Aug 2020 10:49 IST

కశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను కూడా అమరుడయ్యారు. పుల్వామా జిల్లా కమ్రాజ్‌పురా గ్రామంలో భద్రతా బలగాలు  సోదాలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.  ఘటనలో మరో భారత జవాను గాయపడ్డారు. ఘటనాస్థలం నుంచి ఏకే-47 తుపాకీ, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని