కేంద్ర మాజీ మంత్రికి 3ఏళ్ల జైలు శిక్ష
బొగ్గుగనుల కేటాయింపు కేసులో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరు దోషులకు కూడా అదే శిక్షను ఖరారు చేసింది..........
దిల్లీ: బొగ్గుగనుల కేటాయింపు కేసులో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరు దోషులకు కూడా అదే శిక్షను ఖరారు చేసింది. 1999లో అటల్ బిహారీ వాజ్పేయీ హయాంలో దిలీప్ రే బొగ్గు గనులశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఝార్ఖండ్లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక కోర్టు దిలీప్ రేతో పాటు అప్పట్లో ఆ శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్, క్యాస్ట్రన్ టెక్ లిమిటెడ్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్ను దోషిగా తేలుస్తూ ఈ నెల 6న తీర్పు వెలువరించింది. నేడు వీరందరికీ దిల్లీ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల జరిమానా విధించింది. క్యాస్ట్రన్ టెక్కు రూ.60లక్షలు, క్యాస్ట్రన్ మైనింగ్ లిమిటెడ్కు మరో రూ.10 లక్షల అదనపు జరిమానా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!