ఇక ఇంటివద్దే కొవిడ్ నిర్ధారణ పరీక్ష!
కొవిడ్ నిర్ధారణ పరీక్షను ఇంటివద్ద స్వయంగా చేసుకునే నూతన యాంటీజెన్ టెస్ట్ విధానానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది.
20 నిమిషాల్లోపే ఫలితం
ఆమోదం తెలిపిన అమెరికా ఎఫ్డీఏ
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో దాన్ని ఆదిలోనే గుర్తించడం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షను ఇంటివద్ద స్వయంగా చేసుకునే నూతన యాంటీజెన్ టెస్ట్ విధానానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో ఇంటివద్దే స్వయంగా కొవిడ్ టెస్ట్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది.
ఆస్ట్రేలియా కంపెనీ ఎల్యూమ్ అభివృద్ధి చేసిన ఈ నూతన విధానానికి అత్యవసర వినియోగం కింద ఎఫ్డీఏ అనుమతి ఇచ్చింది. ‘హోమ్ కొవిడ్ టెస్ట్’ పేరుతో ఉన్న ఈ కిట్ను రెండేళ్లకు పైబడిన ఏ వ్యక్తైనా వినియోగించుకోవచ్చు. పాకెట్ సైజులో ఉండే ఈ కిట్లో స్వాబ్నుంచి సేకరించిన శాంపిల్ను అందులో పొందుపరచాలి. అనంతరం అది కరోనా వైరస్ ప్రోటీన్లను విశ్లేషించి.. కేవలం 20నిమిషాల్లోపే ఫలితాన్ని మన మొబైల్ ఫోన్కు పంపిస్తుంది.
ఈ విధానంలో కరోనా వైరస్ లక్షణాలున్నవారిలో పాజిటివ్ను 96శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుండగా, లక్షణాలు లేనివారిలో 91శాతం కచ్చితత్వంతో వైరస్ను గుర్తిస్తుందని ఎఫ్డీఏ ప్రకటించింది. అయితే, లక్షణాలున్నవారు, ఇతర టెస్టుల్లో పాజిటివ్ వచ్చినవారు మాత్రం వైద్యులను సంప్రదించాలని ఎఫ్డీఏ సిఫార్సు చేసింది. ఒకేసారి వినియోగించగలిగే ఈ పరికరాన్ని ఆన్లైన్, స్టోర్లలో దాదాపు 30డాలర్లకు విక్రయించే అవకాశాలున్నాయని ఎల్యూమ్ పేర్కొంది. వచ్చే నెలలో లక్షల సంఖ్యలో ఈ పరికరాలను అమెరికాకు రవాణా చేస్తున్నట్టు ఆస్ట్రేలియన్ కంపెనీ వెల్లడించింది. ఈ నూతన విధానం వల్ల కొవిడ్ టెస్టు సౌకర్యం విస్తృతంగా అందుబాటులోకి రానున్నట్లు ఎఫ్డీఏ అభిప్రాయపడింది. అమెరికాలో కరోనా వైరస్కేసుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ కిట్ల వల్ల ప్రస్తుతం చేపడుతోన్న కొవిడ్ టెస్టులపై కాస్త భారం తగ్గనుందని తెలిపింది.
ఇక, ఇంటివద్ద సొంతంగా చేసుకునే సౌలభ్యమున్న ఇలాంటి కొవిడ్ టెస్టులకు ఎఫ్డీఏ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కానీ, ఎల్యూమ్ తయారుచేసిన ఈ పరికరంతో కచ్చితమైన ఫలితం రావడంతో పాటు కేవలం నిమిషాల్లోనే ఫలితం వస్తోంది. అంతేకాకుండా దీనికి ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదని కంపెనీ వెల్లడించింది. ఇంటివద్దే కరోనా టెస్టు చేసుకునేందుకు వీలుగా ‘ల్యూరికా’ అనే కంపెనీకి కూడా ఎఫ్డీఏ గతనెలలో అనుమతి ఇచ్చింది. అయితే, కొవిడ్ లక్షణాలు ఉన్నాయని వైద్యులు భావించి సిఫార్సు చేస్తేనే ఈ పరికరాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని కంపెనీలు సొంతంగా స్వాబ్ శాంపిల్ను సేకరించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కానీ, వీటి విశ్లేషణ కోసం మాత్రం శాంపిళ్లను ల్యాబ్కు పంపించాల్సి ఉంటుంది. కచ్చితమైన ఫలితం క్షణాల్లో రావడంతో ఎల్యూమ్ తయారు చేసిన ఈ విధానం కొవిడ్ టెస్టుల్లో కీలక మైలురాయిగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి..
ప్రపంచంలో పావువంతు ప్రజలకు టీకా కష్టమే..!
కొవిడ్ మూలాలు: జనవరిలో చైనాకు WHO నిపుణుల బృందం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)